మార్గదర్శి చిట్ ఫండ్ అక్రమాలు, నిధుల మళ్లింపు కేసులో తెలంగాణ హైకోర్టు ఏపీ సీఐడీకి కీలక ఆదేశాలు జారీచేసింది. మార్గదర్శికి చెందిన 30 మంది మేనేజర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టంచేసింది.
వైఎస్ వివేకా హత్య కేసులో ఈ రోజు కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్ భాస్కర్ రెడ్డి మరో పిటిషన్ వేశారు. వివేకా హత్య కేసులో ఏ-4గా ఉన్న దస్తగిరిని సీబీఐ అఫ్రూవర్గా ప్రకటించడాన్ని సవాల్ చేశాడు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వైఎస్ షర్మిల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. బీజేపీకి బీ టీమ్లో వైసీపీ పనిచేస్తుందని షర్మిలతో వీరభద్రం అనగా.. అదేం లేదని ఆమె చెప్పారు.
MLA Ramakrishna : వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ పార్టీ మారుతున్నారంటూ ఇటీవల ప్రచారం మొదలైంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఆర్కే హాజరు కాకపోవడంతో... ఆయన పార్టీ వీడుతున్నారంటూ వార్తలు రావడం మొదలయ్యాయి.
పదవులకు, చదువుకు సంబంధం లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టంచేశారు. ఏ పని లేనివారే మోడీ చదువు గురించి చర్చ చేస్తున్నారని విమర్శించారు. ప్రపంచంలో గొప్ప నేతగా మోడీకి పేరుందని గుర్తుచేశారు.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ వ్యాఖ్యలు
Mekapati : పార్టీ నుండి సస్పెండ్ అయిన తర్వాత... మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి... రాజకీయంగా మరింత చురుకుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన .. మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి కలిశారు. కడప జిల్లా ఖాజీపేటలోని ఆయన నివాసంలో సమావేశం అయ్యారు.
అత్యంత ఎత్తయిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది. హైదరాబాద్ లోని కొత్త సచివాలయం సమీపంలో 125 అడుగుల ఎత్తులో విగ్రహం నిర్మించడంపై దళిత వర్గాలు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపాయి.
ప్రధాని మోడీ డిగ్రీ పైన ఆమ్ ఆద్మీ పార్టీ, ఉద్దవ్ థాకరే, బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను ఎన్సీపీ నేత అజిత్ పవార్ తప్పుబట్టారు. డిగ్రీ గురించి ప్రశ్నించడం సరికాదన్నారు.
Jogi Ramesh : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తన పార్టీ ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశం నిర్వహించిన విషయం విదితమే. ఈ సమావేశంలో జగన్..... ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కొందరికి జగన్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రజల్లో గ్రాఫ్ పెంచుకోవాలని హితబోధ చేసినట్లు తెలుస్తోంది.
దేశాన్ని సర్వనాశనం చేస్తున్న నరేంద్ర మోదీని సాగనంపేందుకు ప్రతిపక్షాలు ఏకమయ్యాయి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీని తరిమికొట్టేందుకు పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. పదేళ్లలో కనిపించని అరుదైన దృశ్యం నేడు కనిపించింది.
పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బీజేపీ నేతలతో కలుస్తూ, పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మధ్యాహ్నం మురళీధర రావుతో భేటీ అనంతరం పవన్ ను మీడియా ప్రశ్నించగా.. ఇంకా పలువురు నేతలను కలవాల్సి ఉందని, అందరినీ కలిశాక మాట్లాడుతానని చెప్పారు.