YS Jagan ఎమ్మెల్యేలతో సమావేశం.. అసలు విషయం ఇదేనన్న జోగి రమేష్..!
Jogi Ramesh : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తన పార్టీ ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశం నిర్వహించిన విషయం విదితమే. ఈ సమావేశంలో జగన్..... ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కొందరికి జగన్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రజల్లో గ్రాఫ్ పెంచుకోవాలని హితబోధ చేసినట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తన పార్టీ ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశం నిర్వహించిన విషయం విదితమే. ఈ సమావేశంలో జగన్….. ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కొందరికి జగన్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రజల్లో గ్రాఫ్ పెంచుకోవాలని హితబోధ చేసినట్లు తెలుస్తోంది. ప్రజల్లో గ్రాఫ్ బాగా ఉన్నవారికే టికెట్ ఇస్తారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో జగన్ సమీక్షా సమావేశం పై జోగి రమేష్ వివరణ ఇచ్చారు.
గ్రాఫ్ పెంచుకోవాలని, గ్రాఫ్ ఆధారంగానే టికెట్ అని సీఎం జగన్ చెప్పడంలో తప్పేం లేదని అన్నారు. వైస్సార్సీపీ మళ్లీ అధికారంలోకి రావడం కోసమే గ్రాఫ్ పెంచుకోవాలని సూచించారని తెలిపారు. నెలలో 25 రోజుల పాటు గడప గడపకు కార్యక్రమం చేపట్టాలని నిర్దేశించారని జోగి రమేశ్ వెల్లడించారు.
ఇక, విపక్ష నేతలపైనా జోగి రమేశ్ విమర్శనాస్త్రాలు సంధించారు. నాలుగు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలిచిన చంద్రబాబు పొంగిపోతున్నాడని, చంద్రబాబుకు 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ములేదని అన్నారు. ఒంటరిగా గెలిచే సత్తా లేకనే దత్తపుత్రుడు, వామపక్షాలు కలిసి రావాలంటున్నాడని ఎద్దేవా చేశారు. అయితే, వచ్చే ఎన్నికల్లో పవన్ బీజేపీ తో కలవడని, చంద్రబాబు వైపే ఉంటాడని జోగి రమేశ్ పేర్కొన్నారు. పవన్ ఎప్పుడు ఏ పార్టీతో కలుస్తాడో అతడికే తెలియదని వ్యంగ్యం ప్రదర్శించారు.