చదువుతోపాటు ఉపాధి కల్పిస్తేనే దళితుల బతుకులు బాగుపడతాయి. దారిద్ర్య రేఖ దిగువన ఉన్న 30 శాతం మంది ప్రజలను కూడా దళిత బంధు పథకంలో చేర్చాలి. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ తో కలిసి మాట్లాడతా.
హైదరాబాద్ నడిబొడ్డున అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని బీజేపీ స్వాగతిస్తోందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు.
వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల ప్రాణాలకు ముప్పు ఉందని మాజీ మంత్రి, వైసీపీ నేత డీఎల్ రవీంద్రా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.
అంబేడ్కర్ చెప్పిన విధంగా ప్రజలకు అన్యాయం జరిగితే పోరాడుతూ ముందుకు వెళ్తున్నాం. సీఎం కేసీఆర్ దమ్మున్న నాయకుడు. సచివాలయానికి పేరు పెట్టడం సీఎం కేసీఆర్ కే సాధ్యం.
తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ మధ్య ఉన్న దూరం మరోసారి బయటపడింది. 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాం ఆవిష్కరించే కార్యక్రమానికి గవర్నర్ను సీఎం ఆహ్వానించలేదు..
సీఎం కేసీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానించారని వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న ద్రోహి కేసీఆర్ అని విరుచుకుపడ్డారు.
తమిళనాడు బీజేపీ అధ్యక్షులు అన్నామలై డీఎంకే ఫైల్స్ పేరిట ఆ పార్టీ నేతల ఆస్తుల చిట్టాను మీడియా ముందు పెట్టారు.
తెలుగు రాష్ట్రాల్లో వి.హనుమంత రావు (V Hanumantha Rao) అదే వీహెచ్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఆయన పంచ్ లు, ఆయన హావభావాలు, వ్యవహార శైలి తెలుగు ప్రజలను ఆకట్టుకుంటాయి. అప్పట్లో నిత్యం మీడియాలో ఉంటూ హల్ చల్ చేసేవారు. ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు.. మాజీ ఎంపీ. అలాంటి వ్యక్తి కోరికను తెలంగాణ మంత్రి కేటీఆర్ (KT Rama Rao) తీర్చారు. పెద్దాయన చేసిన ఉద్యమం ఫలించింది.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ [&hel...
ఓటును ఎవరు కూడా అమ్ముకోవద్దని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై మాజీమంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి గుడివాడకు ఏమీ చేయలేదని విమర్శించారు.
నారా లోకేశ్ యువగళం పాదయాత్రపై టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. ఆయనో కర్మ జీవి.. గొప్ప లీడర్ అంటూ కొనియాడారు.
హైదరాబాద్ శివారులో నర్సింగ్ రావు అనే వ్యక్తి తనకు దళితబంధు పథకం ఇవ్వడం లేదని వినూత్నంగా నిరసనకు దిగాడు. రేడియో టవర్ ఎక్కి మరీ తన గోడును వెల్లబోసుకున్నాడు.
టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సాయి లౌకిక్, సుస్మితను సిట్ అధికారులు విచారిస్తారు. తన భార్య సుష్మిత కోసం డీఏవో కొశ్చన్ పేపర్ను ప్రవీణ్ నుంచి రూ.10 లక్షలకు సాయి లౌకిక్ కొనుగోలు చేశాడని సిట్ చెబుతోంది.
కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 11,109 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.
2024 ఎన్నికల్లో విడదల రజనీకి టిక్కెట్ ఇస్తే తాము సహకరించేది లేదని చిలకలూరిపేట వైసీపీ అసమ్మతి వర్గీయులు హెచ్చరించారు.