MLG: తాడ్వాయి మండలం మేడారంలో పలు గ్రామాలకు చెందిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు రాష్ట్ర మంత్రి సీతక్క చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లును త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని, పూర్తయిన ఇళ్లుకు డబ్బులు చెల్లించాలని ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్ దివాకర టీఎస్ తదితరులు ఉన్నారు.
NGKL: పదర మండల కేంద్రంలోని శ్రీకృష్ణ దేవాలయం యొక్క ప్రహరీ గోడను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గురువారం ప్రారంభించారు. అనంతరం స్వామివారికి పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ చిక్కుడు అనురాధ, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
HYDలో కస్టమర్లు తీసుకోని పార్సిళ్లను వేలం వేయనున్నట్లు RTC కార్గో విభాగం ప్రకటించింది. ఫిబ్రవరి 27న సికింద్రాబాద్ జేబీఎస్ కార్గో కార్యాలయంలో ఈ వేలం జరగనుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించే ఈ వేలంలో సుమారు 60 రకాల సరుకులు అమ్మకానికి ఉంటాయి. వస్తువులు అసలు ధర కంటే గరిష్టంగా 30% తక్కువ ధరకు లభించే అవకాశం ఉందన్నారు.
SRD: సంగారెడ్డి మున్సిపాలిటీలో శుక్రవారం మంచినీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నేషనల్ హైవే విస్తరణ పనులు జరుగుతున్నందున పైప్ లైన్ షిఫ్టింగ్ చేస్తున్నట్లు చెప్పారు. అత్యవసరమైన కలనీలకు మంచినీటి ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తామని పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
SRCL: ఇల్లంతకుంట మండలంలోని అనంతారం ప్రాజెక్టు అన్నపూర్ణ రిజర్వాయర్ నుండి వేసవి ముందు మత్తడి దూకుతూ గురువారం జలకళను సంతరించుకుంది. ఈ జలాల విడుదల వల్ల స్థానిక రైతులకు సాగునీటి అవసరాలను తీరుస్తూ పంటలను కాపాడుతున్నదని హార్షం వ్యక్తం చేస్తున్నారు.
BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామంలో నల్లాల బావి దగ్గర మోటార్ పాడైపోవడంతో గురువారం GP కార్యదర్శి రంజిత్, 5వ వార్డు మెంబర్ రాజేందర్, 6వ వార్డు మెంబర్ సురేష్, GP పంప్ ఆపరేటర్ అంజి గురువారం మరమ్మతు పనులు చేపట్టారు. ఈ సందర్భంగా వార్డు మెంబర్ రాజేందర్ మాట్లాడుతూ.. రానున్న వేసవిలో తాగునీటి సమస్య ఇబ్బంది కలగకుండా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
KMM: జిల్లా వెలగమట్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల కూల్చివేత బాధితులను BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ పరామర్శించారు. వారు మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదవారి ఇళ్లను కూల్చడమా? ప్రభుత్వమే ఇచ్చిన పట్టాలు, భూదాన్ బోర్డు పత్రాలు, కాగా కోర్టు ఆర్డర్లు ఉన్నప్పటికీ, కనీస నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను ధ్వంసం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు.
గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. గురువారం అమరావతి, జీటీ రోడ్లలోని 47 ఆక్రమణలను అధికారులు తొలగించారు. ఆక్రమణలు స్వచ్ఛందంగా తొలగించుకోకపోతే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ కె. మయూర్ అశోక్ హెచ్చరించారు. అనధికార ఫ్లెక్సీలు, బ్యానర్లపైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
E.G: ఏపీ శాసన మండలిలో శాసనమండలి BJP ప్లోర్ లీడర్ ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై వైసీపీ ఎమ్మెల్సీలు దాడులు చేయడం సిగ్గుచేటని బీజేపీ సీనియర్ నాయకులు కోన సత్యనారాయ గురువారం పేర్కొన్నారు. సీనియర్ సభ్యుడిపై ఇలాదాడులకు దిగడం ప్రజాస్వామ్య విలువలకే విరుద్దమని విమర్శించారు. సభలో మహిళా మంత్రులు అని కూడా చూడకుండా వైసీపీ సభ్యులు ప్రవర్తించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
AKP: మాకవరపాలెం మండలం తూటిపాలలో ఇసుక తవ్వకాలను తహసీల్దార్ వెంకటరమణ గురువారం అడ్డుకున్నారు. ఈ గ్రామ శివారున ఉన్న సర్పానది నుంచి ఇసుక తరలింపునకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం రావడంతో సిబ్బందితో కలిసి అక్కడకు చేరుకొని ఇసుక తవ్వుతున్న ఒక జేసీబీని స్వాదీనం చేసుకున్నారు. ఇసుక అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
E.G: ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఖ్యాతిగాంచిన కాణిపాకం స్వయంబు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గాల జనసేన సమన్వయకర్త వేగుళ్ళ లీలాకృష్ణ గురువారం భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థాన అధికారులు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
JN: జాతీయ రహదారి నిర్మాణంలో ప్లాట్లు కోల్పోతున్న బాధిత ప్లాట్ యజమానుల రిలే దీక్షకు 3వ వార్డు కౌన్సిలర్ బూడిద జ్యోతి మద్దతు తెలిపారు. కౌన్సిలర్ మాట్లాడుతూ.. జనగామ పట్టణంలో ఏకశిలా గడ్డకు ప్లాట్లు కోల్పోతున్న భూ-యజమానులు నష్టపరిహారం ఇవ్వాలని, వారి సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.
KRNL: వైసీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి కురువ శశికళ కృష్ణమోహన్ కుటుంబ సమేతంగా ఇవాళ మాజీ సీఎం జగన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆలూరు నియోజకవర్గ రాజకీయ పరిస్థితులు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. 2029 ఎన్నికల్లో వైసీపీకు విజయం సాధించేందుకు అహర్నిశలు కృషి చేస్తామని పేర్కొన్నారు.
AP: అల్లూరి జిల్లా కోర్టు పోక్సో కేసులో సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. బాలికపై అత్యాచారం చేసి చంపిన కేసులో నిందితుడు రమేష్కు యావజ్జీవ శిక్ష విధించింది. రూ. లక్ష జరిమానా మొత్తంతో పాటు, బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం తరపున నష్టపరిహారం అందించాలని కూడా కోర్టు సూచించింది.
BDK: అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుక ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యావత్ భారతదేశం మొత్తంలో ఉన్న బంజారా ప్రజలను ఏకం చేసి సన్మార్గాన్ని చూపించిన మహనీయుడు సేవాలాల్ మహారాజ్ అని కొనియాడారు.