KMR: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా KMR జిల్లా కేంద్రంలోని సీఎస్ఐ చర్చిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఛైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ గారికి చర్చి ఫాదర్ జోసఫ్ కీశోర్, శ్రీలత కిషోర్ ఆధ్వర్యంలో ఘనంగా షాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం చర్చి ఫాదర్ ప్రత్యేక ప్రార్ధనలతో ఛైర్ పర్సన్కు ఆశీర్వాదాలు అందచేశారు.
JGL: కథలాపూర్ మండలం భూషణరావుపేట గ్రామంలో గ్రామ స్వరాజ్య సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని సర్పంచ్ బద్దం మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని గ్రామంలోని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉపసర్పంచ్ గంగ పోచయ్య, వార్డు సభ్యులు, సంస్థ ప్రతినిధి, అంగన్వాడీ టీచర్లు, మహిళలు పాల్గొన్నారు.
ASF: పెంచికల్ పేట మండలంలోని కేజీబీవీ బాలికల నివాస పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులకు 150కి పైగా శానిటరీ నాప్కిన్లను సీఐ కుమారస్వామి, ఎస్సై అనిల్లు ఆదివారం పంపిణీ చేశారు. అలాగే 10వ తరగతి చదువుతున్న 40 మంది విద్యార్థులకు పరీక్షా కిట్లు అందజేశారు. సీఐ మాట్లాడుతూ.. విద్యార్థినులు కష్టపడి చదివి ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
AP: మార్కాపురం జిల్లా చిన్న గుడిపాడు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సీఎం చంద్రబాబు ట్రయల్ రన్ మినీ వ్యాన్ ఓ యువకుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకర్ వెంకన్న(25) అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ కాన్వాయ్ బైకర్ను రాంగ్ రూట్లో వచ్చి ఢీకొట్టినట్లు సమాచారం.
న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ ఫిన్ అలెన్ టీమిండియా బౌలర్ బుమ్రాపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘నా మంత్రం చాలా స్పష్టం. బంతిని చూసి ఆడతాను తప్ప, బౌలర్ పేరును చూసి కాదు. అవతల బుమ్రా పరిగెత్తుకుంటూ వస్తున్నాడని ఆలోచిస్తే.. ఆట కంటే ఒత్తిడికే ఎక్కువ లోనవుతాం. అందుకే నేను బౌలర్ ప్రతిష్ట గురించి ఆలోచించకుండా కేవలం బాల్ మీద మాత్రమే ఫోకస్ చేస్తా’ అని పేర్కొన్నాడు.
VZM: మహిళలు బలంగా ఉంటేనే కుటుంబం, జిల్లా, రాష్ట్రం మరియు దేశం బలంగా ఉంటాయని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన జిల్లా స్థాయి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి కుటుంబానికి ఒక ఇంటర్ప్రెన్యూర్ తయారు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
VKB: బొంరాస్ పేట మండలం లింగ్యానాయక్ తండాలో సర్పంచ్ సోంమ్లా నాయక్ సేవాలాల్, మరియమ్మ గుడి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సొంత నిధులతో నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ప్రవీణ్ కుమార్, ఉప సర్పంచ్ హన్మ్యా నాయక్, ఢాక్యా నాయక్, తండావాసులు పాల్గొన్నారు.
WNP: ఏదుట్ల గ్రామంలో శివాజీ మహారాజ్ విగ్రహ నిర్మాణం కోసం గ్రామ సమావేశంలో క్రింది కమిటీ ఏర్పాటుచేయబడింది. అధ్యక్షుడిగా గుణగంటి శేఖర్, ఉపాధ్యక్షులుగా నల్లభోతుల రమేష్, మండ్ల శివకుమార్ లను ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శి మండ్ల కుమార్, కోశాధికారి గోకారం సాయికుమార్, గౌరవ అధ్యక్షుడు సంకేండ్ల విష్ణు, కార్యదర్శులు చీకొండ్ర మల్లేష్, బోనమోని శివకుమార్, గుణగంటి రాముడు, తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం కొత్త బెల్లంకొండవారిపాలెం గ్రామంలో ఆదివారం ఎంపీడీవో ఆర్.వి.యస్. ప్రసాదరావు ఫీల్డ్ వెరిఫికేషన్ నిర్వహించారు. హౌస్ ట్యాక్స్ డోర్ టు డోర్ వసూలు, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే పనులను పరిశీలించారు. రోజువారీ లక్ష్యాలను నిర్లక్ష్యం లేకుండా సమయపాలనతో పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు.
PLD: ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం పిడుగురాళ్ల పార్టీ కార్యాలయంలో అనారోగ్య కారణాల వల్ల హాస్పటల్లో చికిత్స చేయించుకున్న ఆర్థిక స్తోమత లేని వారికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల వారికి అందజేశారు.
KNR: పెరిగిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలని బీజేపీ కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ హుజురాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద సీపీఎం పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం సీపీఎం పార్టీ మండల కార్యదర్శి కొప్పుల శంకర్ మాట్లాడుతూ.. ఇప్పటికే పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
ప్రకాశం: కంభంలోని ఓ చికెన్ షాపులో ఆదివారం నకిలీ కరెన్సీ ఘటన చోటుచేసుకుంది. షాప్ రద్దీగా ఉన్న సమయంలో ఓ వ్యక్తి 100 నకిలీ నోటు ఇచ్చి చికెన్ తీసుకుని వెళ్లిపోయాడు. రద్దీ తగ్గిన తర్వాత డబ్బులు చూసిన షాప్ యజమానికి ఆ నోటు ఫేక్ అని తెలిసింది. దీంతో ఒక్కసారిగా అవాక్కైన ఆయన జరిగిన విషయాన్ని పరిచయస్తులకు తెలిపాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
NRML: మహిళా దినోత్సవం వేళ నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల సేవలు స్ఫూర్తిదాయకం. ఆమె ‘నిర్మల్ పోలీస్ మీ పోలీస్’, ‘సివంగి’, ‘నారీశక్తి’, ‘పోలీస్ అక్క’ లాంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల దత్తత, మహిళా పోలీసుల ప్రోత్సాహంతో పాటు నిష్పక్షపాతంగా న్యాయం చేస్తూ అభాగ్యులకు అండగా నిలుస్తున్న ఎస్పీ సేవలు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాయి.
TPT: తిరుపతి శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయ స్థలంలో నిర్మించిన అమ్మవారి వేంచేపు మండపాన్ని ఆదివారం మాజీ ఎంపీ టీజీ వెంకటేష్, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పార్కింగ్ షెడ్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.
ADB: సమాజంలో మహిళల పాత్ర కీలకమైందని ఆదిలాబాద్ MP గోడం నగేశ్ అన్నారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం స్థానిక బస్స్టాండ్లో సన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బేబీ ఫీడింగ్ రూమ్ను జిల్లా కలెక్టర్ రాజర్షి షాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులను ఘనంగా సత్కరించారు.