• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఆలయ అభివృద్ధి కోసం భూమి కొనుగోలు

JGL: పెగడపల్లి మండల కేంద్రంలోని గల శ్రీ స్వయంబూ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భూమిని కొనుగోలు చేశారు. ఆలయ ఆవరణలో కమిటీ సభ్యులు, గ్రామస్థులు ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఆలయానికి ప్రక్కనున్న కొండ శ్రీనివాస్ గౌడ్ చెందిన రెండు గుంటల భూమిని రూ. 17,10,000 వేలకు కొనుగోలు చేసినట్లు వాళ్ళ కమిటీ ఛైర్మన్ శ్రీనివాస్ తెలిపారు.

February 24, 2026 / 12:31 PM IST

ఉపాధి హామీ పనులు ప్రారంభం

MDK: చిలిపిచేడ్ మండలం శిలాంపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులను నూతన సర్పంచ్ రాజేందర్ రెడ్డి, కార్యదర్శి అఖిల్ మంగళవారం ప్రారంభించారు. కూలీలకు పని కల్పించడమే లక్ష్యంగా ఈ పనులు చేపట్టినట్లు వారు పేర్కొన్నారు. అర్హులైన గ్రామస్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ రమేశ్, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

February 24, 2026 / 12:31 PM IST

కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 985 పాయింట్లు పతనమై 82,308 వద్ద, నిఫ్టీ 288 పాయింట్లు నష్టపోయి 25,424 వద్ద కొనసాగుతున్నాయి. US అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ నిర్ణయాలు, ఐటీ రంగంలో అమ్మకాల ఒత్తిడి మార్కెట్ల పతనానికి ప్రధాన కారణమయ్యాయి. ముఖ్యంగా AI ప్రభావం, టారిఫ్ భయాలతో ఐటీ రంగానికి చెందిన ఇన్ఫోసిస్, TCS వంటి సంస్థలు 3 శాతం మేర నష్టపోయాయి.

February 24, 2026 / 12:30 PM IST

గాంధారి సిహెచ్‌లో గర్భిణీలకు వైద్య పరీక్షలు

KMR: గాంధారి CHCలో అమ్మ ఒడి కార్యక్రమంలో భాగంగా గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్లు డాక్టర్ సాయికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. CHC పరిధిలోని గర్భిణీ మహిళలు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. అలాగే వారికి పౌష్టికాహారం తీసుకోవాలని అవగాహన కల్పించారు.

February 24, 2026 / 12:30 PM IST

మల్లమ్మ మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే సంతాపం

BHNG: మోతె మండలం రాఘవపురం గ్రామానికి చెందిన మట్టిపల్లి మల్లమ్మ ఇటీవల మరణించగా, మంగళవారం మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆమె నివాసానికి చేరుకుని భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మల్లమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

February 24, 2026 / 12:30 PM IST

ఆలయ నిర్మాణానికి స్థల సేకరణ చేయాలని వినతి

ASF: కాగజ్ నగర్ పట్టణంలోని కాపు వాడలో పోచమ్మ ఆలయం స్థల సేకరణ చేయాలని 6వ వార్డ్ కౌన్సిలర్ ఎమ్మాజీ శారదా సంతోష్ కోరారు. ఈ మేరకు మంగళవారం ఎమ్మెల్సీ దండే విఠల్ ఆదేశాల మేరకు తహసీల్దార్‌కి వినతిపత్రం అందజేశారు. ఆలయ స్థలం సేకరణకై పూర్తి సహాయ సహకారాలు అందజేస్తానని, త్వరలోనే ఆలయ నిర్మాణానికి స్థల సేకరణ చేస్తానని తహసీల్దార్ హామీ ఇచ్చారని తెలిపారు.

February 24, 2026 / 12:30 PM IST

‘ఫోటోగ్రాఫర్ పై దాడి నిందితులను శిక్షించాలి’

NLG: తిరుమలగిరి మండలంలో ఫోటోగ్రాఫర్ మధుపై మద్యం మత్తులో దాడి చేసి, కెమెరాలు ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ చిట్యాల మండల ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ అధ్యక్షుడు సైదులు యాదవ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వృత్తిధర్మంలో ఉన్నవారిపై ఇలాంటి దాడులు అమానుషమని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చిట్యాల పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు.

February 24, 2026 / 12:28 PM IST

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ‘ప్రజాబాట’

SRPT: అనంతగిరి మండల పరిధిలోని వాయిల సింగారం గ్రామంలో మంగళవారం ఘనంగా ‘ప్రజాబాట’ కార్యక్రమం నిర్వహించారు. అనంతగిరి సెక్షన్ అధికారులు, గ్రామ సర్పంచ్ శ్రీనివాసులు, పంచాయతీ సిబ్బందితో కలిసి గ్రామ పర్యటన చేశారు.​ ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ప్రజాబాట ద్వారా సేకరించిన వినతులను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

February 24, 2026 / 12:28 PM IST

పట్టణ ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తాం

BDK: మణుగూరు మున్సిపాలిటీ పల్లె దవాఖాన వరకు సుమారు రూ. 60 లక్షల అంచనా వ్యయంతో నిర్మించబడనున్న సైడ్ డ్రైన్ పనులకు నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మంగళవారం పాల్గొన్నారు. పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని ఆయన తెలిపారు. పట్టణ ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పిస్తామన్నారు.

February 24, 2026 / 12:27 PM IST

నరహరి 74 కిలోల కుస్తీ విభాగంలో మూడో స్థానం

NRPT: క్రీడాకారులను ప్రోత్సహించడానికి నిర్వహించిన సీఎం కప్ కుస్తీ పోటీల్లో ఊట్కూర్ మండలం అవుసలోనిపల్లికి చెందిన విద్యార్థి నరహరి రాష్ట్ర స్థాయిలో మూడో స్థానం సాధించాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన పోటీల్లో కామారెడ్డి జిల్లా క్రీడాకారుడితో తలపడిన నరహరి 74 కిలోల విభాగంలో విజయం సాధించి, ప్రశంసాపత్రం, రూ.10,000 నగదు బహుమతి పొందాడు.

February 24, 2026 / 12:27 PM IST

విజయవాడలో జ్యోతి పార్టీ సమావేశాలు

KRNL: ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ వైకుంఠం జ్యోతి ఈ నెల 24, 25, 26 తేదీల్లో విజయవాడలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే ముఖ్య సమావేశాల్లో ఆమె పాల్గొననున్నారు. ఈ మూడు రోజుల పాటు నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండరని పార్టీ కార్యాలయం తెలిపింది. 27వ తేదీ నుంచి మళ్లీ యథావిధిగా ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని పార్టీ కార్యాలయం వెల్లడించింది.

February 24, 2026 / 12:26 PM IST

రిలే దీక్షలు చేపట్టిన అంగన్వాడీ కార్యకర్తలు

CTR: తమ న్యాయమైన కోర్కెలను ప్రభుత్వం పరిశీలించి పరిష్కరించాలని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. మంగళవారం పుంగనూరు రాంపల్లి సమీపానగల ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు రిలే దీక్షలు చేపట్టారు. వేతనాలు పెంచడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ కార్యకర్తలకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.

February 24, 2026 / 12:25 PM IST

కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

BHPL: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారులు, డిజైనర్లకు రాష్ట్ర ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోందని BHPL జిల్లా చేనేత & జోలి శాఖ సహాయ సంచాలకులు వై. శ్రీకాంత్ రెడ్డి ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. 25 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చేనేత కార్మికులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

February 24, 2026 / 12:25 PM IST

‘మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు’

MNCL: బెల్లంపల్లి 1 టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో పోచమ్మ చెరువు సమీపంలో రోడ్డు భద్రతపై మంగళవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. వాహనదారులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనదారులు సీట్ బెల్ట్ వేసుకోవాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

February 24, 2026 / 12:24 PM IST

సింహాచలం భూ సమస్యలపై కీల‌క‌ సమీక్ష

VSP: అమరావతి సచివాలయంలో సింహాచలం దేవస్థానం భూ వివాదాలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. రెవెన్యూ, దేవాదాయ శాఖ మంత్రులు, ఉన్నతాధికారుల‌తో పాటు విశాఖ ఎంపీలు గణబాబు, వెలగపూడి రామకృష్ణ బాబు, విష్ణుకుమార్ రాజులు పాల్గొని భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించి స్థానిక ప్రజల ఇబ్బందులను తొలగించాల‌ని విజ్ఞప్తి చేశారు.

February 24, 2026 / 12:23 PM IST