KRNL: ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆదేశాల మేరకు గోనెగండ్ల మండలం అగ్రహారం గ్రామానికి సంబంధించిన కొత్త గ్రామ కమిటీ ఏర్పాటు చేశారు. అగ్రహారం స్థాయి నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసి కమిటీని ఇంఛార్జ్కు బుధవారం అందజేశారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతం, అభివృద్ధి కోసం ఈ కమిటీ కీలక పాత్ర పోషిస్తుందని నాయకులు పేర్కొన్నారు.
WNP: కేంద్ర జౌళి శాఖ ఆధ్వర్యంలో వనిత జ్యోతి మహిళా సంఘం (NGO) సహకారంతో శ్రీరంగాపురం మండలంలో చేతివృత్తుల వారికి ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అసిస్టెంట్ డైరెక్టర్ సువర్చల మాట్లాడుతూ..కళాకారుల గుర్తింపు కార్డుల ప్రాధాన్యతను, ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. ముద్రా పథకం ద్వారా రుణాలు అందిస్తామని బ్యాంక్ మేనేజర్ మల్లికార్జున్ భరోసా కల్పించారు.
MNCL: జన్నారం, లక్షెట్టిపేట, దండేపల్లి పట్టణాల్లో నిర్వహించిన ఇంటర్ పరీక్షకు 16మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జన్నారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 156 మంది విద్యార్థులకు గాను ఆరుగురు, లక్షెట్టిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 245 మంది విద్యార్థులు ఆరుగురు, దండేపల్లి జూనియర్ కళాశాలలో 185 మంది విద్యార్థులకు గాను నలుగురు విద్యార్థులు పరీక్షను రాయలేదు.
VKB: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమాలను పాటించాలని కరణ్ కోట్ పోలీసులు సూచించారు. బుధవారం మండల పరిధిలోని ప్రధాన కూడళ్లలో వాహనదారులకు రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని ఏఎస్సై రాములు అవగాహన కల్పించారు.
KRNL: ఎమ్మిగనూరులో అదనపు న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఇవాళ అసెంబ్లీలో కోరారు. మంత్రాలయం, పెద్దకడబూరు, ఎమ్మిగనూరు మండలాల కేసులు పెరగడంతో సత్వర న్యాయం అందడం లేదని పేర్కొన్నారు. హైకోర్టు అదనపు సివిల్ జడ్జి, సీనియర్ డివిజన్ కోర్టులకు అనుమతి ఇచ్చినప్పటికీ నిధులు కేటాయించలేదని ఎమ్మెల్యే వివరించారు.
అన్నమయ్య జిల్లాలో ఇంటర్ పరీక్షల భద్రతను ఎస్పీ ధీరజ్ బుధవారం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. రాయచోటి జూనియర్ కళాశాల, సంబేపల్లి గురుకుల కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, 144 సెక్షన్ అమలును పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద అపరిచిత వ్యక్తులు ఉండరాదని, సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు.
ATP: జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కడపలో నిర్వహించిన భారీ ఆత్మీయ సమావేశంలో ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షుడు, అహుడా ఛైర్మన్ టీసీ వరుణ్ పాల్గొన్నారు. పవన్ కల్యాణ్ ఆశయాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. రాబోయే రెండు వారాల సమయాన్ని సద్వినియోగం చేసుకుని అత్యధిక సభ్యత్వాలు నమోదు చేయాలని కోరారు.
ఏలూరు 1 టౌన్ పరిధి చిరంజీవి బస్టాండ్ దగ్గర తమ ఇళ్ళ మధ్య బ్రాందీషాపు పెట్టవద్దంటూ స్థానికులు బుధవారం నిరసన చేపట్టారు. గత కొద్దిరోజులుగా ఆషాపులో మధ్యం దుకాణం తెరువబోతున్నారని తెలిసి బ్యానర్లతో మా పరిసర ప్రాంతాల్లో మద్యం షాపు పెట్టకూడదంటూ ధర్నాకి దిగారు. బ్రాందీ షాపు తొలగించేంతవరకు ఊరుకునేది లేదని స్దానిక మహిళలు అన్నారు.
కోనసీమ: యువత మాదకద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అమలాపురం రూరల్ సీఐ ప్రశాంత్ కుమార్ అన్నారు. అమలాపురం రూరల్ సమనస గ్రామంలో మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో బుధవారం మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో సీఐ పాల్గొని మాట్లాడుతూ… యువత వ్యసనాలకు బానిసలై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు.
లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మాణంలో రజినీకాంత్ ‘తలైవార్ 173’ మూవీ చేయనున్నారు. శిబి చక్రవర్తి తెరకెక్కించనున్న ఈ మూవీలో మలయాళ దర్శకనటుడు బాసిల్ జోసెఫ్ భాగం కానున్నాడట. ఇందులో రజినీ తనయుడు పాత్రలో ఆయన కనిపించనున్నట్లు సమాచారం. ప్రియాంక మోహన్ కూడా ఈ మూవీలో నటించనుందట. ఇక ఈ సినిమా షూటింగ్ 2026 ఏప్రిల్లో స్టార్ట్ కానున్నట్లు, 2027 సంక్రాంతికి రిలీజ్ కానున్నట్లు టాక్.
TG: హైదరాబాద్లో 16వ ఆర్థిక సంఘం సిఫార్సులపై ఆర్థికశాఖ, CESS ఆధ్వర్యంలో కీలక సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎస్ రామకృష్ణారావుతో పాటు మాజీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియా, ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తదితర ఆర్థికవేత్తలు పాల్గొన్నారు. కేంద్ర పన్నుల వాటా, రాష్ట్రాల కార్యాచరణ, అభివృద్ధి వ్యూహాలపై ఈ సదస్సులో లోతుగా చర్చించారు.
ప్రకాశం: గిద్దలూరులో తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీడీపీఓ కార్యాలయం ముందు అంగన్వాడీ కార్యకర్తలు బుధవారం రెండోరోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కనీసవేతనం రూ. 26 వేలు అమలుచేయడం, వేతనంతో కూడిన వేసవి సెలవులు, మినీ అంగన్వాడీలను మెయిన్ వర్కర్లుగా గుర్తించడం, 4 లేబర్ కోడ్ల రద్దు తదితర డిమాండ్లు చేశారు. ఎన్నికల హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలన్నారు.
NRML: నిర్మల్ జిల్లాలో మంగళవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం తొలిరోజు పరీక్ష ప్రశాంతంగా నిర్వహించామని డిఐఈఓ పరుశురాం తెలిపారు. జిల్లాలోని 23 పరీక్ష కేంద్రాలలో విద్యార్థులు ప్రశాంతంగా పరీక్ష రాసారని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని రేపటి ద్వితీయ సంవత్సరం పరీక్షకు సైతం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
AP: సీఎస్ విజయానంద్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనం కేసులో హైకోర్టులో విచారణ జరిగింది. గ్రూప్-1 పరీక్షలో ఎంపికైనవారిని సిట్ విచారణ పూర్తయ్యేవరకు అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేయాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. ఈనెల 11న ఆదేశాలిస్తే ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది.
ASF: ఆసిపాబాద్ ఆదివాసి మహిళ MLA కోవ లక్ష్మిపై క్యతన్ పల్లి సంఘటనలో A12 గా చూపిస్తూ అక్రమంగా కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆదివాసి హక్కుల పోరాట సమితి నాయకులు తెలిపారు. నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా ఆదివాసి మహిళ MLA పై కేసు బనాయించడం దారుణమన్నారు. తక్షణమే అక్రమ కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.