• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

సౌందర రాజన్ మృతదేహానికి మాజీ ఎంపీ నివాళులు

RR: చిలుకూరు శ్రీ బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు సౌందర రాజన్ ఆరోగ్య సమస్యల కారణంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తెలుసుకున్న చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి వారి నివాసానికి చేరుకుని ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా.. సౌందర రాజన్ మృతితో విషాద ఛాయలు అలముకున్నాయి

February 27, 2026 / 06:37 PM IST

రోడ్డు భద్రతపై అవగాహన.. నేత్ర పరీక్షలు నిర్వహణ

HNK: రోడ్డు ప్రమాద నివారణ కార్యక్రమంలో భాగంగా ఐనవోలు పోలీసులు శుక్రవారం ప్రత్యేక శిబిరం నిర్వహించారు. యాక్సిడెంట్ బ్లాక్ స్పాట్‌గా గుర్తించిన పున్నేలు గ్రామ శివారులోని ఏకశిలా స్కూల్ సమీపంలో, నేషనల్ హైవే–563పై హెవీ వాహన డ్రైవర్లకు ఎస్సై శ్రీనివాస్ సిబ్బందితో కలిసి నేత్ర పరీక్షలు నిర్వహించారు. చూపు సమస్యలు ఉన్న వారికి ఉచితంగా కళ్లజోడులు పంపిణీ చేశారు.

February 27, 2026 / 06:37 PM IST

రాయికోడ్ 10వ వార్డులో ఎస్ఈడీ బల్బులు

నారాయణపేట: నర్వ మండలం రాయికోడ్ గ్రామం 10వ వార్డులో విద్యుత్ స్తంభాలకు కొత్త ఎస్ఈడీ బల్బులను ఏర్పాటు చేశారు. సర్పంచ్ పీ. శశికళ రవికుమార్ ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది వీటిని అమర్చారు. రాత్రి వేళల్లో ప్రజలకు మెరుగైన వెలుతురు, భద్రత కల్పించేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు సర్పంచ్ తెలిపారు. ఎస్ఈడీ బల్బులతో విద్యుత్ ఆదా అవుతుందని ఆమె పేర్కొన్నారు.

February 27, 2026 / 06:36 PM IST

‘మాలీ కులస్థులను ST జాబితాలో చేర్చాలి’

ASF: మాలీ కులస్థులను ST జాబితాలో చేర్చేందుకు పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టేలా కృషి చేయాలని కోరుతూ MLC దండే విఠల్‌కు కాగజ్ నగర్‌లో శుక్రవారం ఆ సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. తమ సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్యామ్రావు, జిల్లా అధ్యక్షుడు వాసు, విజయ్ శ్రీనివాస్, వసంత్ పాల్గొన్నారు.

February 27, 2026 / 06:35 PM IST

‘విద్యార్థులు శిఖరాలు అధిరోహించాలి’

GDWL: పదవ తరగతి విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను చేరాలని గట్టు ఎస్సై శేఖర్ గౌడ్ కోరారు. గోర్లఖాన్ దొడ్డి పాఠశాల వీడ్కోలు సమావేశంలో మాట్లాడుతూ.. సోషల్ మీడియాకు దూరంగా ఉండి ఏకాగ్రతతో పరీక్షలు రాయాలని సూచించారు. జిల్లా స్థాయిలో ప్రతిభ చూపిన విద్యార్థుల పైచదువుల ఖర్చును తానే భరిస్తానని తెలిపారు. 42 మందికి ఉచిత స్టడీ మెటీరియల్ అందించారు.

February 27, 2026 / 06:35 PM IST

దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురి అరెస్ట్

NRML: ఖానాపూర్ మండలంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను అరెస్ట్ చేయడం జరిగిందని నిర్మల్ ఏఎస్పీ సాయికిరణ్ తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన గురిజాల నడిపి నరహరి, భూటా శంకర్, చీమల శ్రీకాంత్, బూర్క లక్ష్మణ్, గాదె రమేష్, దాసన్ల శ్రీనివాస్ ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఈ ఆరుగురిని పట్టుకుని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.

February 27, 2026 / 06:34 PM IST

క్రీడాకారులను అభినందించిన కలెక్టర్

PDPL: జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఇవాళ జిల్లా సమీకృత కలెక్టరేట్లో సీఎం కప్ 2025 క్రీడా పోటీలలో ప్రతిభ చూపిన విద్యార్థులను ప్రత్యేకంగా సన్మానించారు. జిల్లా నుంచి పాల్గొన్న 22 మంది క్రీడాకారులలో 4 బంగారు, 8 వెండి, 10 కంచు పథకాలు సాధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికారి సురేష్, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

February 27, 2026 / 06:34 PM IST

ప్రజావాణి గ్రీవెన్స్ సెల్ ఆఫీసర్‌గా నియామకం

మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు విశ్వవిద్యాలయంలో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ విభాగ అధ్యాపకుని డాక్టర్ ఎస్. రవికుమార్‌ను ప్రజావాణి పిర్యాదుల నోడల్ ఆఫీసర్‌గా నియమిస్తూ పాలమూరు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పీ.రమేష్ బాబు నియామక ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్ ఎస్. రవికుమార్‌ను పలువురు అభినందనలు తెలిపారు.

February 27, 2026 / 06:34 PM IST

గాయత్రి పంప్ హౌస్ నుంచి గోదావరి నీరు విడుదల

KNR: రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రి పంప్ హౌస్‌లో ‘బాహుబలి’ మోటార్లు గర్జించాయి. యాసంగి సాగును దృష్టిలో ఉంచుకుని అధికారులు గోదావరి జలాలను విడుదల చేశారు. పంప్ హౌస్ నుంచి ఎత్తిపోసిన నీటిని వరద కాలువ ద్వారా శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి తరలిస్తున్నారు. శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టుల నుంచి వారబంది పద్ధతిలో నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు.

February 27, 2026 / 06:33 PM IST

పేదలకు ఆసరాగా CMRF చెక్కులు పంపీణీ చేసిన: ఎమ్మెల్యే

MHBD: వైద్య ఖర్చులతో ఇబ్బందులు పడకుండా పేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తెలిపారు. తొర్రూరు పట్టణంలో క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో తొర్రూరు, పెద్దవంగర, రాయపర్తి మండలాలకు చెందిన 189 మంది బాధితులకు ప్రభుత్వం నుంచి మంజూరైన రూ. 1.05 కోట్ల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను శుక్రవారం ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

February 27, 2026 / 06:33 PM IST

పీఆర్సీ కమిషన్ తక్షణమే ఏర్పాటు చేయాలి: ఏపీటీఎఫ్

SKLM: ప్రభుత్వం ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. శుక్రవారం నరసన్నపేట మండల తహసిల్దార్ కార్యాలయం వద్ద ఈ మేరకు వారు ధర్నా నిర్వహించారు. సభ్యులు శ్రీధర్ రావు మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. పెండింగ్ సమస్యలు తీర్చాలని అన్నారు.

February 27, 2026 / 06:32 PM IST

రేపు ఖమ్మం జిల్లాలో ఈటల రాజేందర్ పర్యటన

TG: వెలుగుమట్ల భూబాధితులకు భరోసా కల్పించేందుకు BJP MP ఈటల రాజేందర్.. రేపు ఖమ్మం వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈటల బాధితులతో ముఖాముఖి సమావేశం కానున్నారు. క్షేత్రస్థాయిలో వారు ఎదుర్కొంటున్న కష్టాలను నేరుగా అడిగి తెలుసుకుంటారు. పార్టీ పక్షాన బాధితులకు చట్టబద్ధంగా పూర్తి న్యాయం జరిగేలా అవసరమైన అన్ని వేదికలపైనా పోరాటానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేయనున్నారు.

February 27, 2026 / 06:32 PM IST

జాబ్ మేళ పోస్టర్ ఆవిష్కరించిన SI

ADB: నార్నూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఎస్సై శ్రీసాయి జాబ్ మేళ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జిల్లా కేంద్రంలోని AR హెడ్ క్వాటర్స్ వద్ద మార్చి 10వ తేదీన జాబ్ మేళ నిర్వహిస్తున్నామన్నారు. వివిధ కంపెనీల్లో భారీగా ఉద్యోగాల ఖాళీలు ఉండటంతో నిరుద్యోగ యువత తమ ధ్రువపత్రాలతో భారీ ఎత్తున వచ్చి సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

February 27, 2026 / 06:31 PM IST

దరఖాస్తులకు ఆహ్వానం

VZM: వీటి అగ్రహారం ప్రభుత్వ ITI కళాశాలలోని నైపుణ్య కేంద్రం నందు జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ కోర్సుకు 3 నెలలు శిక్షణ కొరకు ధరఖాస్తులు కోరడమైనదని ITI ప్రిన్సిపల్ టి.వి గిరి తెలిపారు.18 నుంచి 35 ఏళ్లలోపు ఉండి, ఇంటర్ చదివిన వారు అర్హులన్నారు. అభ్యర్ధులు మార్చి 5వ తేదీలోపు https://forms.gle/vkUYDKj9DZyaHY2T8 లింక్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.

February 27, 2026 / 06:30 PM IST

‘చంద్రబాబు జీవితం మొత్తం వివాదాస్పదమే’

AP: వైఎస్ జగన్ మీద చంద్రబాబు దారుణమైన విమర్శలు చేశారని వైసీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి ఆరోపించారు. ‘దొంగదారిలో ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి చంద్రబాబు. ఆయన జీవితం అంతా అత్యంత వివాదాస్పదమే. యూనివర్సిటీలో కూడా రెడ్డి, కమ్మల మధ్య గొడవలు పెట్టారు. తన అవసరాలకు ఎవరినైనా, ఎలాగైనా వాడతారు. ఒక్కో ఎలక్షన్‌కు ఒక్కో పార్టీని వాడుకుంటున్నారు’ అంటూ విమర్శించారు.

February 27, 2026 / 06:30 PM IST