• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఓటీటీ ఎంట్రీకి సిద్ధమైన నిఖిల్

వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరో నిఖిల్ OTTలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. తాను త్వరలోనే ఒక వెబ్ సిరీస్‌లో నటించనున్నట్లు నిఖిల్ వెల్లడించాడు. దీని ద్వారా తన డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఎంట్రీ ఉంటుందని తెలిపాడు. మరి ఆయన OTT ఎంట్రీ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో వేచి చూడాలి.

February 27, 2026 / 09:22 AM IST

రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

విశాఖ నగరంలో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. అక్కిరెడ్డిపాలేనికి చెందిన తలాడ గోపాలరావు స్కూటీపై బీహెచ్పీ వైపు బయల్దేరారు. మార్గమధ్యంలో జీవీఎంసీ చెత్త లారీ వెనుక నుంచి స్కూటీని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన గోపాలరావు అక్కడికక్కడే మృతి చెందారు. గాజువాక ట్రాఫిక్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు.

February 27, 2026 / 09:21 AM IST

VIDEO: కల్తీ రాయుళ్లకు కలెక్టర్ వార్నింగ్

W.G: జిల్లాలో కల్తీ ఆహార పదార్థాల విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ చదలవాడ నాగరాణి హెచ్చరించారు. గత 2రోజులుగా జిల్లావ్యాప్తంగా పాల కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భీమవరంలో జరిగిన తనిఖీల్లో పట్టుబడిన కల్తీ పాల పదార్థాలను మున్సిపల్ కార్యాలయం వద్ద కలెక్టర్ స్వయంగా పరిశీలించారు.

February 27, 2026 / 09:21 AM IST

గన్నవరంలో కూరగాయలు ధరలు ఇవే.!

క‌ృష్ణా: గన్నవరం మార్కెట్‌లో రోజువారీ వినియోగించే ప్రధాన కూరగాయల ధరలు శుక్రవారం ఇలా ఉన్నాయి. టమాటా రూ.14, గులాబీ వంకాయలు రూ.17-18గా నమోదయ్యాయి. ఉల్లి రూ.23, బంగాళాదుంపలు రూ.22గా ఉన్నాయి. దొండ రూ.26, దోస.24, బీట్‌రూట్ రూ.25గా విక్రయమయ్యాయి. క్యాప్సికం రూ.59, ఫ్రెంచ్ బీన్స్ రూ.53గా ఉన్నాయి. బీర రూ.24, పచ్చిమిర్చి రూ.36, నిమ్మకాయలు డజన్‌కు రూ.48/36గా ఉన్నాయి.

February 27, 2026 / 09:20 AM IST

వైరల్‌గా మారిన సచివాలయ ఉద్యోగిని లెటర్

ఏలూరులోని తంగెళ్ల మూడి సచివాలయంలో ANMగా పనిచేస్తున్న కామేశ్వరి రాసినట్లు ఉన్న లేఖ సామాజిక మధ్యలో వైరల్‌గా మారింది. పని ఒత్తిడిలో తాను అలసిపోయానని, సెలవు ఇప్పించాలని ఉన్నతాధికారులకు అర్జీ ఇచ్చినట్లు లేఖలో పేర్కొన్నట్లు ఉంది. సెలవు ఇవ్వడం కుదరదని అధికారులు చెప్పడంతో కామేశ్వరి బుధవారం నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు.

February 27, 2026 / 09:20 AM IST

‘ఒక్కరోజు ముందుగానే సామాజిక పెన్షన్ పంపిణీ’

E.G: మార్చి నెల NTR సామాజిక భరోసా పెన్షన్ ఒకరోజు ముందుగానే పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. అర్హులైన వృద్ధులు , వికలాంగులు, వితంతువులకు అందజేయనున్నట్లు తెలిపారు. మొదటి తారీకు ఆదివారం కావడంతో ఫిబ్రవరి 28న తారీఖున లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.

February 27, 2026 / 09:20 AM IST

జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిని కలిసిన ఎమ్మెల్యే

WGL: జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిను నిన్న సాయంత్రం హైదరాబాద్‌లోని మంత్రి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. ఈ సందర్భంగా జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రస్తుత సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులపై ఎమ్మెల్యే మంత్రికి వివరించినట్లు తెలిసింది. ఈ కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్ పాల్గొన్నారు.

February 27, 2026 / 09:20 AM IST

3న వేములవాడ రాజన్న ఆలయం మూసివేత

TG: చంద్రగ్రహణం సందర్భంగా మార్చి 3న ఉదయం వేములవాడ రాజరాజేశ్వరస్వామి, భీమేశ్వరస్వామి ఆలయాలను మూసివేయనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. మార్చి 3న ఉదయం ప్రాతఃకాల పూజ అనంతరం రాజన్న ఆలయంతోపాటు అన్ని అనుబంధ దేవాలయాలను మూసివేస్తారు. అదే రోజు రాత్రి 7 గంటలకు సంప్రోక్షణ అనంతరం యధావిధిగా పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మ.3:30కు ప్రారంభమై పాక్షిక చంద్రగ్రహణం సా.6 గంటలకు ముగుస్తుంది.

February 27, 2026 / 09:20 AM IST

ప్రారంభోత్సవానికి భవనాలు సిద్ధం

PPM: సీతంపేట మండలంలోని ఇప్పగూడ మరో ముస్తాబు గ్రామంగా సిద్దమైంది. ప్రస్తుతం గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ‘గ్రామ ముస్తాబు’ పనుల్లో భాగంగా వీధులన్నీ శుభ్రం చేస్తూ, భవన ప్రారంభోత్సవానికి గ్రామస్థులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ ఇచ్చిన పిలుపు మేరకు స్పూర్తి, ప్రోత్సాహం ఆలోచనలతో ఆ గ్రామం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు.

February 27, 2026 / 09:19 AM IST

సిద్దిపేటలో మార్చి 1న ప్రవేశ పరీక్ష

SDPT: టీజీ ఎస్సీ స్టడీ సర్కిల్లో వివిధ పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సిద్దిపేట జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి హమీద్ తెలిపారు. అభ్యర్థులు హల్ టికెట్స్‌ని tsstudycircle.co.in నుంచి డౌన్‌లోడ్ చేయాలని తెలిపారు. మార్చి 1న స్థానిక ప్రతిభ డిగ్రీ కళాశాలలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 వరకు పరీక్ష ఉంటుందన్నారు.

February 27, 2026 / 09:19 AM IST

BREAKING: టాస్ గెలిచిన టీమిండియా

ఆస్ట్రేలియా వుమెన్స్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత మహిళల జట్టు టాస్ గెలిచింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 3 వన్డేల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే తొలి వన్డే ఓడిన నేపథ్యంలో.. సిరీస్‌ను కాపాడుకునేందుకు హర్మన్ సేన ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సి ఉంది.

February 27, 2026 / 09:18 AM IST

2.5 కిలోల గంజాయి స్వాధీనం

SRD: తెల్లాపూర్ అంబేడ్కర్ కాలనీ హనుమాన్ దేవాలయం వద్ద కారులో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు మహ్మద్ ఖాన్ (33), మహ్మద్ ఓవైజ్ (23)ల నుంచి 2.5 కిలోల గంజాయితో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులను కోర్టులో హాజరుపరిచారు. నిరంతరం నిఘా కొనసాగిస్తామని అధికారులు వెల్లడించారు.

February 27, 2026 / 09:18 AM IST

అంతర్‌రాష్ట్ర గంజాయి ముఠాకు చెక్

హైదరాబాద్ సిటీ పోలీస్ టాస్క్ ఫోర్స్, అఫ్జగంజ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో అంతర్‌రాష్ట్ర గంజాయి ముఠా పట్టుబడింది. ఈ ఆపరేషన్‌లో ఏడుగురు రవాణాదారులు, ఒక స్థానిక విక్రేతను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 16 లక్షల విలువైన 23 కేజీల గంజాయి, ఒక బైక్, 6 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

February 27, 2026 / 09:16 AM IST

దాదాపూర్‌లో వీర జవాన్ విగ్రహావిష్కరణ

VKB: దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్ స్వర్గీయ తోకని శ్రీనివాస్ విగ్రహావిష్కరణ మహోత్సవం రేపు దాదాపూర్‌లో జరగనుంది. మాతృభూమి సేవలో అమరుడైన ఈ వీరుడికి సముచిత గౌరవం కల్పిస్తూ గ్రామస్థులు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. దేశం కోసం సర్వస్వం ధారపోసిన జవాన్ త్యాగాన్ని స్మరించుకుంటూ ఆయనకు ఘన నివాళి అర్పించడం మనందరి బాధ్యత అని గుర్తు చేశారు.

February 27, 2026 / 09:15 AM IST

ఇది ప్రభుత్వం కాదు.. రియల్ ఎస్టేట్ కంపెనీ: కేటీఆర్

TG: గాంధీ కుటుంబానికి వెయ్యి కోట్లు పంపుతానని ప్రామిస్ చేశారని మాజీ మంత్రి KTR విమర్శలు చేశారు. డబ్బుల కోసం పేదల ఇళ్లు కూల్చి, భూములు అమ్ముతున్నారని ఆరోపించారు. పేదల ఇళ్లు కూల్చుతున్న CM రేవంత్ తన రెండో ప్యాలస్, భట్టి విక్రమార్క మూడో ఇల్లు కట్టుకుంటున్నారని తెలిపారు. ఇది ప్రభుత్వం కాదని, రియల్ ఎస్టేట్ కంపెనీ అని ధ్వజమెత్తారు.

February 27, 2026 / 09:15 AM IST