KDP: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు APSPDCL,CMD శివశంకర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇవాళ ఉదయం 10 నుంచి 12:30 గంటల వరకు ఉంటుందన్నారు. వినియోగదారులు 89777 16661 నంబరుకు ఫోన్ చేసి సమస్యలు పరిష్కరించుకోవచ్చునన్నారు.
NZB: తెలంగాణ యూనివర్సిటీలో ఎల్.ఎల్.బి 5వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 23, 25, 27 మార్చి 2, 4 తేదీల్లో మధ్యాహ్నం 2 గం.ల నుంచి సాయంత్రం 5 గం.ల వరకు పరీక్షలు వెల్లడించారు.
KDP: కమలాపురం మార్కెట్ యార్డులో ఏపీ మార్క్ఫెడ్, నాఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో కలిసి శనగలను పరిశీలించి, తూకాల్లో మోసాలు లేకుండా రైతులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి చంద్రా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
KDP: ఇవాళ్టి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. ఇంటర్ పరీక్షలకు కడప జిల్లాలో 62 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లాలో 33,664 మంది ఇంటర్ విద్యార్థులు ఉన్నారు.1st ఇయర్ 17,100,2nd ఇయర్ 16,564 మంది విద్యార్థులు ఉన్నారు. KDP-20, PDTR-8, MYKR, PRMML, BDVLలో 4, PVLD, JMDలో 3, KMLPRM, KJPTలో 2, మిగతా ప్రాంతాల్లో ఒకటి చొప్పున సెంటర్లు ఏర్పాటు చేశారు.
అన్నమయ్య: రాయచోటిలో శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల భాగంగా అశ్వవాహనం పై పారువేటకు స్వామివారు బయలుదేరగా, దేవస్థానం నుంచి పట్టణ పురవీధుల్లో ఊరేగింపు భక్తులను ఆకట్టుకుంది. కోలాటాలు, మేళతాళాలు, డప్పులతో పారువేట ఉత్సవం సందడిగా జరిగింది. కార్యక్రమంలో రాయచోటి తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు.
KDP: వేంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కుప్పాలపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని ఎస్సై తిరుపాల్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి సైబర్ మోసాలు, చట్టాలపై అవగాహన కల్పించారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, అనుమానాస్పద కాల్స్పై 1930కు సమాచారం ఇవ్వాలని కోరారు.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం; ఉత్తరాయణం; శిశిర రుతువు, ఫాల్గుణ మాసం, శుక్ల పక్షం షష్ఠి: ఉ.10-03 తదుపరి సప్తమి; భరణి: సా.5-33 తదుపరి కృతిక; వర్జ్యం: తె.4-45 నుంచి 6-14 వరకు; దుర్ముహూర్తం: మ.12-36 నుంచి 1-22 వరకు, తిరిగి 2-55 నుంచి 3-41 వరకు; రాహుకాలం: ఉ.7-30 నుంచి 9 వరకు; సూర్యోదయం: ఉ.6.27; సూర్యాస్తమయం: సా6 గంటలకు.
వ్యాపారవేత్త, తమిళ నటి విష్ణుప్రియ తండ్రి సూర్యనారాయణన్ హత్యకు గురయ్యారు. TN దిండిగల్ జిల్లాలో నారాయణన్కు ఓ గెస్ట్ హౌస్ ఉండగా.. 2 రోజుల క్రితమే అందులో అద్దెకు చేరిన ఐదుగురు యువకులు ఆయనను చంపేసి భారీ మొత్తంలో నగదు, నగలతో పరారయ్యారు. CC TV ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా విష్ణుప్రియ తమిళ సినిమా ‘మాయావి(2005)’లో సూర్యతో కలిసి నటించింది.
అఫ్గనిస్థాన్పై పాకిస్థాన్ వైమానిక దాడులు జరపడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. పవిత్ర రంజాన్ మాసంలో పాక్ ఈ దాడులకు పాల్పడటం, ఇందులో మహిళలు, చిన్నారులు సహా సామాన్యులు ప్రాణాలు కోల్పోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ఇది తమ అంతర్గత వైఫల్యాలను ఇతరులపై రుద్దేందుకు పాక్ చేసిన ప్రయత్నమేనన్నారు.
➢ 1483: మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ జననం➢ 1503: పదకవితా పితామహుదు అన్నమయ్య మరణం➢ 1931: సంస్కృతాంధ్ర భాషా ప్రవీణులు నూజిళ్ల లక్ష్మీనరసింహం జననం➢ 1957: కేంద్ర మాజీమంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు జననం➢ 1967: ఇండో-అమెరికన్ న్యాయవేత్త శ్రీ శ్రీనివాస్ జననం➢ ప్రపంచ ఇంద్రజాలికుల(మెజీషియన్స్) దినోత్సవం
ప్రధాని మోదీ ఈ నెల 25న ఇజ్రాయెల్ వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కోసం జెరూసలేంలో ఎదురుచూస్తున్నట్లు ఇజ్రాయెల్ PM నెతన్యాహు తెలిపారు. భారత్-ఇజ్రాయెల్ బంధం ఇద్దరు ప్రపంచ నాయకుల శక్తిమంతమైన కూటమి అని అభిప్రాయపడ్డారు. తాము ఇన్నోవేషన్, రక్షణ, వ్యూహాత్మక దార్శనికతలో భాగస్వామ్యులమని.. ఉన్నత శిఖరాలకు చేరేందుకు AI మొదలు ప్రాంతీయ సహకారం వరకు తమ బంధం ఇలాగే ఉంటుదన్నారు.
తాము పెళ్లి చేసుకుంటున్నట్లు విజయ్ దేవరకొండ-రష్మిక మంధాన స్వయంగా ప్రకటించారు. అభిమానులను ఉద్దేశించి ఒకే తరహా నోట్ను ఇన్స్టా స్టోరీగా పోస్ట్ చేశారు. ‘ప్లాన్ చేయడానికి ముందే మీరు ప్రేమతో మాకు VIROSH అని పేరు పెట్టారు. మీ అభిమానానికి గుర్తుగా మా వేడుకను THE WEDDING OF VIROSH పేరిట నిర్వహించాలని అనుకుంటున్నాం. మీ ప్రేమకు ధన్యవాదాలు’ అని రాసుకొచ్చారు.
భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. అత్యధికంగా 18* వరుస T20ల్లో కనీసం ఓ వికెట్ పడగొట్టిన భారత ఆటగాడిగా అవతరించాడు. గతంలో ఈ రికార్డ్ అర్ష్దీప్(2024-25 మధ్యకాలంలో 17 T20లు) పేరిట ఉండేది. ఆశిష్ నెహ్రా(2016లో 13), వాషింగ్టన్ సుందర్(2024-25లో 11) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
TG: ప్రజలు నమ్మి ఓటేశారని, కుర్చీలకే పరిమితం కాకుండా బాధ్యతాయుతంగా పనిచేయాలని ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు సూచించారు. ఎన్నికల వరకే రాజకీయాలు పరిమితమని.. ఆ తర్వాత ఏ పార్టీ వారైనా ప్రజా ప్రభుత్వం తరఫున పేదవాళ్లకు సేవ చేయాల్సిందేనని స్పష్టంచేశారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు కృషి చేయాలని పేర్కొన్నారు.
సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచులో భారత్ ఘోరంగా ఓడింది. 188 పరుగుల లక్ష్యఛేదనలో దూబే(42) మినహా ఎవరూ ఆశించిన స్థాయిలో రాణించలేదు. దీంతో 111 పరుగులకే పరిమితమై 76 రన్స్ తేడాతో ఓటమిపాలైంది. ప్రత్యర్థి బౌలర్లలో యాన్సెన్ 4, మహారాజ్ 3, బాష్ 2 వికెట్లు పడగొట్టారు. కాగా గత టోర్నీ మొదలు చివరి 14 T20 WC మ్యాచుల్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్కు ఇదే తొలి ఓటమి.