• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రోడ్డు భద్రత నియమాలపై పోలీసుల వినూత్న నాటిక

ASF: రోడ్డు భద్రత నియమాలపై ప్రజలకు అవగాహనకై పోలీసులు వినూత్నంగా నాటక ప్రదర్శన చేపట్టారు. రెబ్బెన మండలం నంబల గ్రామంలో నిర్వహించిన కార్యక్రమానికి SP నితిక పంత్ హాజరయ్యారు. అతివేగం, మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల కలిగే అనర్ధాలను కళాకారులు నాటిక రూపంలో కళ్లకు కట్టినట్లు వివరించారు. ఒక్క రోడ్డు ప్రమాదం ఒక నిండు కుటుంబాన్ని రోడ్డపడేస్తుందని SP అన్నారు.

February 28, 2026 / 07:51 AM IST

కులాంతర వివాహమే హత్యకు కారణం: సీఐ

కోనసీమ: కులాంతర వివాహం ఇష్టం లేని కారణంతోనే ద్వారపూడికి చెందిన పోలుపల్లి వీరవెంకట సూర్య ప్రకాశరావును యువతి సోదరులు హత్య చేసినట్లు రూరల్ సీఐ దొరరాజు తెలిపారు. అయినవిల్లి డిప్యూటీ తహశీల్దార్ సంధ్య, ఆమె సోదరుడు కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారన్నారు. మృతుడి ఇంటి వద్దకు వెళ్లి రాళ్లతో దాడి చేయడంతో రక్తస్రావమై మృతి చెందారని పేర్కొన్నారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

February 28, 2026 / 07:50 AM IST

శ్రీవారి సన్నిధిలో భారీగా భక్తుల రద్దీ

AP: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో భక్తుల రద్దీ భారీగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులతో అన్ని కంపార్టుమెంట్లు నిండాయి. టోకెన్లులేని భక్తులకు సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 67,952 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,414 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా.. హుండీ ఆదాయం రూ.3.97 కోట్లు వచ్చింది.

February 28, 2026 / 07:48 AM IST

అప్రమత్తతోనే ప్రమాదాలకు అడ్డుకట్ట: డీఎస్పీ

MHBD: అప్రమత్తతోనే ప్రమాదాలకు అడ్డుకట్ట వేయవచ్చని తొర్రూర్ డీఎస్పీ కృష్ణ కిషోర్ అన్నారు. శుక్రవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వాహనదారులు హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. అతివేగం, పరిమితికి మించి ప్రయాణికులతో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పువన్నారు.

February 28, 2026 / 07:48 AM IST

ఇఫ్తార్ విందు ఇచ్చిన ఉపసర్పంచ్

SRCL: కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో రంజన్ మాసంలో శుక్రవారం ఉపవాసం ఉండి, మజీద్‌లో ప్రార్థనలు చేసి, గ్రామ ప్రజలందరూ బాగుండాలని కోరుకున్నారు. ఉప సర్పంచ్ తిక్కల నవీన్ మాట్లాడుతూ.. రంజన్ రోజా (ఒక్కపొద్దు)లో పాల్గొని సాయంత్రం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లింలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

February 28, 2026 / 07:47 AM IST

టీ పొడి దుకాణాలపై దాడులు..!

ఏలూరు: నగరంలోని టీ పొడి దుకాణాలపై విజిలెన్సు, ఆహార భద్రత, తునకలు కొలతల శాఖ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ అసిస్టెంట్ కమిషనర్ వెంకటరత్నం మాట్లాడుతూ.. కొన్ని టీ పొడి లేబుల్స్ తేడాగా ఉండడానికి గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలోనే శాంపుల్స్ సేకరించి ల్యాబ్కు తరలించామన్నారు. మొత్తం 3 షాపుల్లో తనిఖీలు నిర్వహించామన్నారు.

February 28, 2026 / 07:46 AM IST

జిల్లాలో సాహిత్యంపై జాతీయ సదస్సు

కడప: ఐఎంఏ హాల్‌లో ఈనెల 28, మార్చి 1 తేదీల్లో వైఎస్సార్ జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో పుత్తా పుల్లారెడ్డి సాహిత్యంపై జాతీయ సదస్సు జరగనుంది. ఈసదస్సులో ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి, వీసీలు జయరామిరెడ్డి, నిత్యానందరావు పాల్గొంటారు. ఈ సందర్భంగా శృంగార శాకుంతలం గ్రంథావిష్కరణ,18 మంది పరిశోధకులతో పత్ర సమర్పణలు ఉంటాయని అధ్యక్షులు మల్లికార్జున రెడ్డి తెలిపారు.

February 28, 2026 / 07:45 AM IST

పారిశుద్ధ్య పర్యవేక్షణలో ఐసీసీసీ కీలకం: కలెక్టర్

HNK: వరంగల్ నగర పారిశుద్ధ్య నిర్వహణలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) పాత్ర అత్యంత కీలకమని హనుమకొండ కలెక్టర్, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. శుక్రవారం బల్దియా కార్యాలయంలోని ఐసీసీసీ కేంద్రంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంశంపై అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. శానిటేషన్ ప్రక్రియను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.

February 28, 2026 / 07:45 AM IST

కడుపునొప్పి భరించలేక డిగ్రీ విద్యార్థి సూసైడ్

ASF: రెబ్బెన మండలం దుర్గాపూర్‌కు చెందిన మడావి అజయ్ (18) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై వెంకట కృష్ణ వివరాలు బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న అజయ్ 2 సంవత్సరాలుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. గత నెల 27న వైద్యం కోసం వెళ్లి పురుగు మందు తాగాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆసుపత్రిలో చికిత్స చేయిస్తుండగా శుక్రవారం రాత్రి మృతి చెందాడు.

February 28, 2026 / 07:45 AM IST

నేడు మంత్రి పర్యటన వివరాలు..!

KRNL: మంత్రి ఎన్ఎండి ఫరూక్ నేడు ఉదయం 8:30 కు నంద్యాల టౌన్ 14వ వార్డు పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. తరువాత ఉదయం 11:30 నేషనల్ డిగ్రీ కాలేజ్ లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం‌లో పాల్గొని యువతకు నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, విద్యార్థులు పాల్గొని మంత్రి సూచనలు స్వీకరిస్తారు.

February 28, 2026 / 07:44 AM IST

జిల్లాలో ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమం

VKB: రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా పోలీస్ శాఖ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఘనంగా ప్రారంభించారు. నిన్న పట్టణంలోని సత్యభారతి హాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంటి వైద్య శిబిరం, రోడ్డు భద్రతా అవగాహన సదస్సుకు హాజరై మాట్లాడారు. డ్రైవర్ల కంటి చూపు బాగున్నప్పుడే సురక్షిత ప్రయాణం ఉంటుందన్నారు.

February 28, 2026 / 07:44 AM IST

ఇందిరమ్మ ఇళ్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీక: హరికృష్ణ

SDPT: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పేదల ఆత్మగౌరవానికి ప్రతీక అని సిద్దిపేట కాంగ్రెస్ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ పూజల హరికృష్ణ అన్నారు. శుక్రవారం అర్బన్ మండలం బక్రీ చెప్యాలలో ఇందిరమ్మ ఇళ్ల నూతన గృహప్రవేశంలో పాల్గొని మాట్లాడారు. పేదల సొంతింటి కలను సాకారం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. పేదల, అభివృద్ధి సంక్షేమం ప్రభుత్వ ధ్యేయమన్నారు.

February 28, 2026 / 07:42 AM IST

ఉద్యోగాల పేరుతో మోసం.. ఐదుగురికి జైలు శిక్ష

VSP: ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి పలువురు యువతను మోసం చేసిన కేసులో ఐదుగురికి విశాఖ నాల్గవ అదనపు న్యాయస్థానం రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఎంవీపీ పోలీసుల వివరాల ప్రకారం.. 2021లో డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ బాధితులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. విచారణలో నేరం రుజువుకావడంతో కోర్టు ఒక్కొక్కరికి రూ.10 వేల జరిమానా కూడా విధించింది.

February 28, 2026 / 07:41 AM IST

విధుల్లో నిర్లక్ష్యం.. 50 మంది టీచర్లకు నోటీసులు.!

ఖమ్మం జిల్లాలో విధినిర్వహణలో నిర్లక్ష్యం వహించిన 50 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులపై డీఈవో చైతన్య జైని చర్యలు చేపట్టారు. కారణం లేకుండా గైర్హాజరైన 24 మందికి, అనుమతి లేకుండా ఓడీ పేరుతో గైర్హాజరైన 14 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దెందుకూరు జడ్పీహెచ్‌ఎస్ ఉపాధ్యాయుడిపై ఫిర్యాదుల నేపథ్యంలో నోటీసులు జారీ చేశారు. ఏన్కూరు ఎంపీపీ స్కూల్ హెచ్ఎంను సస్పెండ్ చేశారు.

February 28, 2026 / 07:40 AM IST

45 నిమిషాల ఛార్జింగ్‌తో 250 కి.మీ

TG: కేవలం 45 నిమిషాల ఛార్జింగ్‌తో 250 కిలోమీటర్లు ప్రయాణించే అధునాతన బస్సులు త్వరలో గ్రేటర్ హైదరాబాద్‌కు రానున్నాయి. 1085 విద్యుత్ బస్సుల సరఫరా, నిర్వహణకు ఈవీ ట్రాన్స్‌ లిమిటెడ్‌ ద్వారా రెండు కాంట్రాక్టులను (LOA) ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ సంస్థ దక్కించుకుంది. అన్ని కుదిరితే ఈ బస్సులను 20 నెలల్లో విడతల వారీగా ఆర్టీసీకి అందించనుంది.

February 28, 2026 / 07:40 AM IST