NGKL: వెల్దండ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు ఎనుముల తిరుపతిరెడ్డి, MLA కసిరెడ్డి నారాయణరెడ్డి హాజరై గురువారం ఇంటిని ప్రారంభించారు. MLA మాట్లాడుతూ..అర్హులైన పేదవాడికి గృహ నిర్మాణ పథకం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ పాల్గొన్నారు.
AP: విజయవాడ కలెక్టరేట్లో NH-65పై MP కేశినేని చిన్ని సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ’45 రోజుల్లో వెస్ట్ బైపాస్ పూర్తవుతుంది. ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం తీసుకొస్తాం. మెట్రో ప్రాజెక్టు ఆలస్యంతో ఫ్లైఓవర్ పనులు ఆగాయి. మెడికల్ కాలేజీ- నిడమానూరు వరకు 6 లేన్ల ఫ్లైఓవర్కు అనుమతి వచ్చింది. రైతులకు ఇబ్బంది లేకుండా భూసేకరణ చేస్తాం’ అని తెలిపారు.
NDL: ఆత్మకూరులో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ మాఫియా గుట్టును విజిలెన్స్ అధికారులు రట్టు చేశారు. గురువారం ఆత్మకూరు పట్టణ కేంద్రంగా సాగుతున్న నకిలీ నెయ్యి తయారీ కేంద్రాన్ని గుర్తించి, భారీగా కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. అధికారుల తనిఖీల్లో వెలుగుచూసిన భయంకరమైన నిజాలు స్థానికులను విస్తుపోయేలా చేశాయి.
కామారెడ్డి జిల్లాలో 195 అబాండెడ్ వాహనాలను బహిరంగ వేలం వేయనున్నట్లు ఎస్పీ రాజేష్ చంద్ర ప్రకటించారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో మాట్లాడుతూ.. డిస్ట్రిక్ట్ పోలీస్ యాక్ట్-1861 సెక్షన్ 26 ప్రకారం ఈ చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాహన యజమానులకు తమ హక్కులను క్లెయిమ్ చేసుకోవడానికి ఆరు నెలల గడువు ఉంటుందని, ఈలోపు క్లెయిమ్ చేసుకోకపోతే బహిరంగ వేలం వేస్తామని ఆయన పేర్కొన్నారు.
నల్గొండ: కేతపల్లి మండలం బండపాలెం గ్రామంలోని శ్రీ సీతారాముల స్వామి దేవస్థానానికి నూతన ఛైర్మన్గా మారం మీనారెడ్డిని ఎమ్మెల్యే వేముల వీరేశంను ఏకగ్రీవంగా నియమించారు. మార్చిలో జరిగే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తానని మీనారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కే.శ్రీనివాస్, సర్పంచ్ పెండ్యాల శ్రీనివాసరావు, వి.రాము, కోటిరెడ్డి, సురేష్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.
CTR: సంజీవని ప్రాజెక్ట్ సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్లో పలమనేరు నియోజకవర్గానికి చెందిన డాక్టర్లతో నాల్గవ సమావేశం నిర్వహించి, డిజిటల్ నర్స్ సెంటర్ మరియు “సంజీవిని” ప్రాజెక్ట్పై సమీక్ష సమావేశం నిర్వహించారు. సంజీవినిసేవలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు.
NDL: కొలిమిగుండ్ల(మం) అబ్దుల్లాపురంలో ఇవాళ జూటూరు పుష్పావతి అనే వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి తల్లి గురమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమేష్ బాబు తెలిపారు.
NTR: కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా నుంచి విద్యార్థులు, యువతతో కలిసి డ్రగ్స్పై అవగాహన సైకిల్ ర్యాలీ యాత్ర పోలీస్ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పోలీస్ కమిషనర్ ఎస్ వి. రాజశేఖర్ బాబు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు, ప్రజలు, డ్రగ్సకి దూరంగా ఉండాలన్నారు. ఈ ర్యాలీలో భారీ ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు.
MDCL: పీర్జాదిగూడ చెరువులో గుర్రపు డెక్క తొలగింపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ పనులను ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి పర్యవేక్షించారు. గుర్రపు డెక్క వెంట వెంటనే తొలగించాలని సంబంధిత కాంట్రాక్టర్ని ఆయన ఆదేశించారు. గుర్రపు డెక్కల వలన దోమలు పెరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కావున ప్రజలకు అసౌకర్యం కలగకుండా పనులు పూర్తి చేయాలని అన్నారు.
ELR: బాల్య వివాహాలను అరికట్టాలని ఏలూరు ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ సూచించారు. గురువారం బాల్య వివాహ విముక్తి రథాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. బాల్య వివాహం చట్టరీత్యా నేరమని అన్నారు. 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్నవారికి వివాహం చేయడం సమంజసం కాదని అన్నారు. మనమందరం కలిసికట్టుగా బాల్య వివాహ మూలాలను నిర్మూలించాలని చెప్పుకొచ్చారు.
KMM: బోనకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో “అరైవ్ అలైవ్ క్యాంపెయిన్-2026” నిర్వహించారు. వైరా ఏసీపీ సారంగపాణి వాహనదారులకు రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రాణనష్టం, కుటుంబాలపై పడే ప్రభావం మరియు చట్టపరమైన చర్యల గురించి ఆయన హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించి సురక్షితంగా ప్రయాణించాలని కోరారు.
AP: లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న ముప్పిడి అవినాష్ విచారణ ముగిసింది. లిక్కర్ కేసులో A7గా ఉన్న అవినాష్ను సిట్ అధికారులు ACB కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన కోర్టు రేపటి వరకు రిమాండ్ విధించింది. అనంతరం అవినాష్ను గుంటూరు జిల్లా జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాలతో అవినాష్ ఇవాళ ఉదయం పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే.
W.G. ఆచంటలో గురువారం ఓ పిచ్చికుక్క స్వైరవిహారం చేస్తూ గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేసింది. కచేరి సెంటర్, ఎంవీఆర్ కళాశాల రహదారి, ముత్యాలమ్మ గుడి ప్రాంతాల్లో ఐదుగురు విద్యార్థులతో సహా సుమారు 15 మందిపై దాడి చేసింది. కుక్కకాటుకు గురైన వారంతా PHCలో చికిత్స పొందుతున్నారు. వీధుల్లో కుక్కల బెడద పెరిగిపోవడంతో అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.
KRNL: ఆదోనిలో కౌన్సిల్ బడ్జెట్ సమావేశంలో వైసీపీ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, మున్సిపల్ కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ ఇవాళ మైనార్టీ కాలనీ, నిజాముద్దీన్ కాలనీ ప్రాంతాల అభివృద్ధి పనుల ఆలస్యాన్ని ప్రస్తావించారు. రూ.21.60 లక్షల పనులు భూమిపూజ చేసినప్పటికీ ప్రారంభం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
SRPT: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించి, రూ.22,500 కోట్ల బడ్జెట్తో పనులు వివిధ దశల్లో ఉన్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం హుజూర్ నగర్లోని రామస్వామి వద్ద 110 ఎకరాలలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల ప్లాట్ల పెండింగ్ పనులను జిల్లా కలెక్టర్ తేజస్ నంత్ లాల్ పవార్తో కలిసి పరిశీలించారు.