• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కోల్‌కతాలో భారీగా భూప్రకంపనలు

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.0గా నమోదైంది. దీంతో తీవ్ర భయాందోళనలకు గురైన ప్రజలు.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 27, 2026 / 01:46 PM IST

‘ముదిరాజులను ఆదుకోవాలి’

NRPT: ముదిరాజులను బీసీ డీ గ్రూపు నుండి బీసీఏ గ్రూపులోకి మార్చాలని పాలమూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముదిరాజ్ అన్ని రంగాల్లో ముందుండాలని కోరారు. ప్రభుత్వం ముదిరాజులకు అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో చందు, మొగులప్ప, నారాయణ, చంద్రశేఖర్, పటేల్ శీను ఉన్నారు.

February 27, 2026 / 01:45 PM IST

పాల కేంద్రంలో ఆకస్మిక తనిఖీ

KDP: ఒంటిమిట్ట మండల పరిధిలోని కొత్త మాధవరం పాలకేంద్రాన్ని డిస్ట్రిక్ట్ యానిమల్ హస్బెండ్రీ ఆఫీసర్ డాక్టర్ ఎన్ ఏ. శ్రీనివాసులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పాల కేంద్రంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, పాలు పాడవకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన చర్యలను వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట మండల పరిధిలోని పశు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

February 27, 2026 / 01:45 PM IST

కోర్టుకు హాజరైన వల్లభనేని వంశీ

AP: వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏలూరు జిల్లా నూజివీడులోని కోర్టుకు హాజరయ్యారు. వైసీపీ హయాంలో గన్నవరం నియోజకవర్గంలో నకిలీ పట్టాలకు సంబంధించి ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఆయన కోర్టుకు హాజరయ్యారు. కోర్టు వద్దకు వచ్చిన పలువురు వైసీపీ కార్యకర్తలతో మాట్లాడారు.

February 27, 2026 / 01:44 PM IST

మెదక్ కలెక్టర్‌ను కలిసిన రామాయంపేట తహసీల్దార్

మెదక్ జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రతిమా సింగ్‌ను రామాయంపేట మండల తహసీల్దార్ రజనీకుమారి మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్‌ను కలిసి, ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మండలంలోని పాలనాపరమైన అంశాలు, ప్రజా సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను తహసీల్దార్ వివరించారు.

February 27, 2026 / 01:43 PM IST

ప్రత్యేక పూజ నిర్వహించిన మాజీ మంత్రి రోజా

CTR: నగరి నియోజకవర్గంలోని నిండ్ర మండలం పాదిరి గ్రామంలో శ్రీ రాధా రుక్మిణి సమేత శ్రీకృష్ణుల దేవాలయం నూతన విగ్రహ ప్రతిష్ట మహా కుంభాభిషేక మహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో, అంగరంగ వైభవంగా శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రోజా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు . ఆలయ కమిటీ సభ్యులు మాజీ మంత్రి రోజాకు ఘనంగా స్వాగతం పలికారు.

February 27, 2026 / 01:42 PM IST

పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై విచారణ

TG: కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై హైకోర్టులో విచారణ జరుగుతుంది. కేసీఆర్ తరపున దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. కాగా మేడిగడ్డ పిల్లర్లు కుంగడంపై ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ప్రభత్వానికి జస్టిస్ పీసీ ఘోష్ నివేదికను సమర్పించింది. అయితే కమిషన్ నివేదికను రద్దు చేయాలంటూ గతంలో కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లు వేశారు.

February 27, 2026 / 01:41 PM IST

భద్రాద్రిలో ఘనంగా నిత్య కల్యాణం

BDK: భద్రాద్రి రామాలయంలో సీతారామచంద్రస్వామి వారి నిత్య కళ్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెల్లవారుజామున సుప్రభాత సేవలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేళతాళాల నడుమ ఉత్సవ మూర్తులను బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం అనంతరం కళ్యాణం జరిపారు. ఈ వేడుకను వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

February 27, 2026 / 01:40 PM IST

మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

AP: శాసనమండలిలో తాను చూపించిన స్టేట్‌మెంట్ నిజం కాదని మండలి ఛైర్మన్ ఎలా చెబుతారని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. కేంద్ర నిర్ణయాలు కేబినెట్ సెక్రటరీ పేరిట వస్తాయని, రాష్ట్ర ప్రభుత్వ సమాచారం సీఎస్ పేరిట వస్తుందన్నారు. అసెంబ్లీ సమాచారం సెక్రటరీ జనరల్ పేరిట ఉంటుందన్నారు. మండలి కార్యాలయం నుంచి వెళ్లిన లేఖ అంటే మండలి ఛైర్మన్ నిర్ణయంగానే పరిగణించకుండా ఎలా ఉంటామని తెలిపారు.

February 27, 2026 / 01:40 PM IST

28న ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేత

ELR: ఉంగుటూరు మండలం చేబ్రోలు విద్యుత్ సబ్ స్టేషన్ పరిదిలో శనివారం ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు గొల్లగూడెం ఏ ఈ వేణు తెలిపారు. ఆ మేరకు ఆయన శుక్రవారం తెలిపారు. చెట్టు కొమ్మల తొలగింపు, మరమ్మతుల కొరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగును, వినియోగదారుల సహకరించాలని ఆయన కోరారు.

February 27, 2026 / 01:40 PM IST

ప్రేమ పెళ్లి చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీలు వీరే!

టాలీవుడ్‌లో చాలామంది సెలబ్రిటీలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మహేష్ బాబు-నమ్రత, నాగార్జున-అమల, శ్రీకాంత్-ఊహ వంటి సీనియర్లతో పాటు.. వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి, కిరణ్ అబ్బవరం-రహస్య, వరుణ్ సందేశ్-వితిక, నాగ అశ్విన్-ప్రియాంక దత్, నాగ చైతన్య-శోభిత, విజయ్-రష్మిక వైవాహిక బంధంలో ఉన్నారు.

February 27, 2026 / 01:40 PM IST

లోన్ యాప్ వేధింపులు.. ఆటో డ్రైవర్ ఆత్మహత్య

MDCL: ఘట్‌కేసర్‌లో లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులు మరో వ్యక్తి ప్రాణం తీశాయి. భార్య పేరుతో లోన్ యాప్‌లో రుణం తీసుకున్న ఆటో డ్రైవర్ సాయికుమార్ (35), సకాలంలో చెల్లించకపోవడంతో ఏజెంట్ల నుంచి తీవ్ర వేధింపులు ఎదుర్కొన్నారు. భార్య ఫోటోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు.

February 27, 2026 / 01:39 PM IST

బొలెరో వాహనం బోల్తా పడిన ఘటనపై ఎంపీ స్పందన

KRNL: ఆస్పరి మండలం పుటకలమర్రి వద్ద కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం బోల్తా పడిన ఘటనపై కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు ఇవాళ స్పందించారు. విజయవాడలో ఉన్న ఆయన ఫోన్‌లో అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన క్షతగ్రాతులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. దాదాపు 20 మంది గాయపడటం బాధాకరమని, వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

February 27, 2026 / 01:38 PM IST

పేద కుటుంబాల సొంత ఇంటి కల సాకారం

BDK: మణుగూరు మండలం కూనవరం పంచాయతీ పరిధిలో నిర్మించబడిన ఇందిరమ్మ నూతన ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇవాళ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు షేక్ యాకూబీ, ఎస్.కే.బి.బి., మర్రిశెట్టి లక్ష్మీ, తిరుపతమ్మ కుటుంబాల నూతన గృహాల్లో గృహప్రవేశ పూజల్లో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

February 27, 2026 / 01:37 PM IST

మాజీ కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్ జన్మదిన వేడుకలు

HYD: నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 7వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్ జన్మదిన వేడుకలు శుక్రవారం హైదరాబాద్, కుత్బుల్లాపూర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఆయనను శాలువాతో సత్కరించి, పూలమాలలు వేసి, కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో నిజాంపేట్ మాజీ సర్పంచ్ ప్రమీల సాయిలు యాదవ్, మాజీ డిప్యూటీ మేయర్ శ్రీ పాల్గొన్నారు.

February 27, 2026 / 01:36 PM IST