AP: ఎల్లుండి ఛలో విజయవాడకు మున్సిపల్ కార్మికులు పిలుపునిచ్చారు. 12వ PRC కమిషన్ ఏర్పాటు, జీతాలు పెంచాలని, పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్తో కార్మికులు ధర్నా చేయనున్నారు. సమస్యలు పరిష్కరించకపోతే నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు.
MLG: గోదావరి నది జలాల వినియోగం, వివాదాలపై ప్రతిపక్షాలతో అసెంబ్లీలోనే చర్చించుకుందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ నిర్వహించిన సమీక్ష సమావేశంలో CM మాట్లాడారు. చర్చలు జరగకుండా ఏ సమస్య శాశ్వతంగా పరిష్కారం కాదని CM పేర్కొన్నారు. తెలంగాణలో ప్రతి ఎకరాకు సాగునీరు, ప్రతి పౌరుడికి త్రాగునీరు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
JGL: పెన్షనర్ల పెండింగ్ సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లాలో ఆదివారం జరిగిన టీపీసీఏ జిల్లా స్థాయి సమావేశంలో పెన్షనర్ల సర్వీస్ రూల్స్ పుస్తకాలను సభ్యులకు అందజేశారు. ఈ సమావేశంలో టీపీసీఏ జిల్లా ప్రధాన కార్యదర్శి హన్మంత్ రెడ్డి పాల్గొన్నారు.
KMR: నాగిరెడ్డిపేట గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు పిచ్చయ్యగారి దీపక్ రెడ్డి తండ్రి కృష్ణారెడ్డి ఇటీవల పరమపదించారు. ఆదివారం మృతుడు కృష్ణారెడ్డి దశదిశ కర్మ వేడుకలు నిర్వహించడంతో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ కార్యక్రమంలో పాల్గొని చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆత్మ ఎక్కడున్న శాంతించాలని భగవంతుని వేడుకున్నారు.
ASF: కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భూమి విక్రయం పేరుతో రూ. 17 లక్షలు తీసుకుని మోసం చేసిన రామటెంకి ప్రకాశ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మాలిని గ్రామంలో 5 ఎకరాల భూమి ఉందని లేని భూమిని ఉన్నట్లు నమ్మించాడు. భూమి చూపించాలని అడిగితే బాధితుడిని బెదిరించడంతో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
KRNL: పెద్దకడబూరు మండలంలోని బాపురంలో వెలసిన శ్రీ గంగాదేవి రథోత్సవం ఆదివారం అశేష భక్తవాహిణి నడుమ కన్నుల పండుగగా జరిగింది. ఉదయం అమ్మవారికి బాపురం క్షేత్ర పీఠాధిపతులు శ్రీ బసలింగమ్మ అవ్వ ఆధ్వర్యంలో ఆకుపూజ, కుంకుమార్చన, బిల్వార్చన, పంచామృతాభిషేకంతో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం నుంచి ఉత్సవమూర్తిని ఊరేగింపుగా తెచ్చి రథంపై ప్రతిష్టించి రథోత్సవం నిర్వహించారు.
AKP: నర్సీపట్నం మండలం చెట్టుపల్లిలో కూటమి నాయకులు ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు. వైద్య శిబిరంలో 240 మంది రోగులు చికిత్సలు చేయించుకోగా వారిలో 26 మందికి ఆపరేషన్ నిర్వహిస్తామని వైద్యులు పేర్కొన్నారు. అవసరమైన వారికి ఉచితంగా మందులతో పాటు కళ్లద్దాలు అందజేస్తున్నామని వైద్యులు తెలిపారు.
అన్నమయ్య: తంబళ్లపల్లె నియోజకవర్గాన్ని ‘బంగారు తంబళ్లపల్లె’గా మార్చడమే లక్ష్యమని రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ బి. హరిప్రసాద్ అన్నారు. త్వరలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ను తంబళ్లపల్లెకు రప్పిస్తామని తెలిపారు. ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.
20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ దక్షిణాఫ్రికా జట్టును బ్రెవిస్, మిల్లర్ ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్కు కేవలం 50 బంతుల్లోనే 97 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో ధాటిగా ఆడుతున్న బ్రెవిస్ (45)ను దూబే పెవిలియన్ పంపాడు. ప్రస్తుతం మిల్లర్ (52*)కు తోడుగా స్టబ్స్ (1*) క్రీజులో ఉన్నాడు. SA స్కోరు 13 ఓవర్లలో 128/4.
MBNR: ప్రతి ఒక్కరూ మాతృభూమికి సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శాంతి కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగిన శిశు మందిర్ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను గౌరవించాలని, దేశాభివృద్ధి కోసం ప్రధాని మోదీని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. ఆదివారం ఉదయం నుంచి రాత్రి 7:30 గంటల వరకు స్వామివారిని 47,280 ఈవో రమాదేవి తెలిపారు. స్వామివారికి 2906 కోడె మొక్కులు చెల్లించుకున్నారని తెలిపారు.
TG: హైదరాబాద్లోని Wolves4You Private Limited సంస్థ బిజినెస్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కనీసం ఒక సంవత్సరం అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగానికి అర్హులు. ఎంపికైన వారికి ఏడాదికి రూ.8,40,000 వరకు వేతనం ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు తక్షణమే విధుల్లో చేరాల్సి ఉంటుంది. మార్చి 22 లోపు దరఖాస్తు చేసుకోండి.
ELR: ఆదివారం పెదవేగి మండలం విజయరాయి గాంధీ నగర్ లోని సీతారామ కళ్యాణమండపంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర సమావేశం ఆదివారం జరిగింది. వారం రోజుల్లోగా కోకో గింజల ధరల పాలసీ ప్రకటించి, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధర నిర్ణయించకపోతే కోకో రైతుల పోరాటం తప్పదని, అందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
AP: 4G, 5Gతో కోట్ల మందికి డిజిటల్ సేవలు అందుతున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. భారత్లో డేటా ఖర్చు ప్రపంచంలోనే అతి తక్కువ అని తెలిపారు. రాష్ట్రంలో ఫైబర్ నెట్ సేవలను విస్తరిస్తామని చెప్పారు. 970 ప్రభుత్వ సేవలు ఆన్లైన్లో అందుబాటులో ఉంచామని వెల్లడించారు.
MDK: టేక్మాల్లోని రైతు వేదిక వద్ద ఆదివారం వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా రైతులకు పనిముట్లను పంపిణీ చేశారు. పేట డివిజన్ పరిధిలోని టేక్మాల్, రేగోడ్, అల్లాదుర్గ్ మండలాలకు చెందిన రైతులు ఈ సదుపాయాన్ని పొందారు. అధికారులు మాట్లాడుతూ.. ఆధునిక సాగుకు యంత్రాలు ఎంతో అవసరమని, ఆసక్తి గల రైతులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని, ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.