AP: టీటీడీ ఛైర్మన్ BR నాయుడు అంశం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు పేరిట తప్పుడు ట్వీట్ చేశారని జనసేన నేత వి.నారాయణరావు ఆరోపించారు. ఛైర్మన్పై నాదెండ్ల భాస్కరరావు ట్వీట్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని పోలీసులకు ఆయన తెలిపారు. ఆ పోస్టుకు నాదెండ్ల భాస్కరరావుకు సంబంధం లేదని పీఎస్లో ఫిర్యాదు చేశారు.
SRCL: ఇల్లంతకుంట మండల ఉమ్మడి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం హోలీ సంబరాలు మిన్నంటాయి. క్లబ్ ప్రతినిధులు, సభ్యులు రంగులు చల్లుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. హోలీ పండుగ సామాజిక సామరస్యానికి, స్నేహభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. క్లబ్ కార్యవర్గ సభ్యులు, మండల విలేకరులు పాల్గొన్నారు.
చంద్రగ్రహణం కారణంగా టీమిండియా ప్రాక్టీస్ సెషన్కు ఆటంకం కలిగింది. వాంఖడే స్టేడియంలో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భారత జట్టు ప్రాక్టీస్ చేయాల్సి ఉంది. అయితే, సాయంత్రం 6:47 గంటల వరకు గ్రహణం ప్రభావం ఉండటంతో, ప్రాక్టీస్ సెషన్ను గంట సేపు వాయిదా వేశారు. గ్రహణం సమయంలో ప్రాక్టీస్ చేయడం మంచిది కాదని భారత జట్టు ఈ నిర్ణయం తీసుకున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది.
TG: సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇస్నాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో విప్ ధిక్కరించిన కౌన్సిలపై కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. ఇస్నాపూర్ 8వ వార్డ్ కౌన్సిలర్ మాధవి సభ్యత్వం రద్దు చేశారు.
సత్యసాయి: హిందూపురం పట్టణంలోని ఆల్ హిలాల్ హైస్కూల్ మైదానంలో ఈ నెల 6న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహించనున్నారు. ఈ మేరకు టీడీపీ మైనార్టీ నాయకులతో కలిసి మున్సిపల్ ఛైర్ పర్సన్ రమేష్ కుమార్ సమావేశం ఏర్పాటు చేశారు. ముస్లిం సోదరులందరికీ ఆహ్వాన లేఖలు పంపి, కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
MDK: నిజాంపేట మండలం నందిగామ గ్రామ చెరువు కట్టను ఇరిగేషన్ ఏఈ శ్రీనిధి ఇవాళ పరిశీలించారు. గతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా కట్టకు వాటిల్లిన నష్టాన్ని అంచనా వేశారు. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ స్వప్న, తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గాంధీనగర్ గ్రామ సమీపంలోని రహదారి అయినా జనగాం హుస్నాబాద్ రోడ్డులో ఉన్న మూలమలుపుల వద్ద ప్రమాద సూచికల బోర్డు లేకపోవడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మూలమలుపుల వద్ద ఎలాంటి సూచికలు లేకపోవడంతో తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు స్పందించి బోర్డ్స్ ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.
AP: గ్రామాల అభివృద్ధికి సహకరిస్తున్న సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబుతో జల్ జీవన్ మిషన్ ప్రాజెక్ట్ పనులు.. గ్రామాల్లో రోడ్ల నిర్మాణంపై చర్చించామని ఆయన అన్నారు. సీఎం సూచనలతో వికసిత్ భారత్ లక్ష్యంతో భాగమవుతామని పవన్ పేర్కొన్నారు.
ATP: ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా మంగళవారం నార్పల గ్రామానికి చెందిన గవ్వల శివశంకర్కు అరుదైన గౌరవం దక్కింది. ఆంధ్రప్రదేశ్లో వన్యప్రాణులకు స్వచ్ఛందంగా సేవ చేస్తున్న వారిని గుర్తించి ప్రభుత్వం సన్మానించింది. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ శివశంకర్కు ప్రశంసా పత్రాన్ని అందజేసి అభినందించారు.
కొంతమంది కెమెరామెన్లు హీరోయిన్ల ప్రైవేట్ పార్ట్స్ పై జూమ్ చేసి వీడియో షూట్ చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై నటి ఆషికా రంగనాథ్ స్పందించింది. ‘కెమెరామెన్లు తమ క్రాఫ్ట్ మీద కంటే మా శరీరాలపై ఫోకస్ పెట్టడం చాలా అగౌరవంగా అనిపిస్తుంది. ఇకపై ఇలాంటి వాటిని సహించం, ఇది మా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. సినీ పరిశ్రమ అంతా ఏకతాటిపై నిలబడాలని నిర్ణయించుకున్నాం’ అని పేర్కొంది.
KKD: కాకినాడ బీజేపీ జిల్లా మీడియా ఇన్ఛార్జ్గా చక్ర రమేశ్ నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు మంగళవారం ఆయనకు నియామక పత్రం అందజేశారు. మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చాటిచెప్పాలని కోరారు. పార్టీ సిద్ధాంతాలను మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని రమేశ్కు ఆయన సూచించారు.
NLG: చిట్యాల పట్టణంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో హోలీ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. చిన్న, పెద్ద, ప్రజాప్రతినిధులు అనే తేడా లేకుండా అందరూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ముఖ్యంగా చిన్న కాపర్తి గ్రామంలో జ్వాలా యూత్ సభ్యులు సహజమైన రంగులతో పండుగను జరుపుకుని ఆదర్శంగా నిలిచారు. ఈ వేడుకలు యువతలో ఐక్యతను చాటాయి.
TG: కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. సోలార్ విద్యుత్ వినియోగంపై గ్రామాల్లో అవగాహన కల్పించాలని.. ప్రతి పథకానికి ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి చేయాలని చెప్పారు. పాఠశాలల్లో డ్రగ్స్ పై కఠిన నిఘా ఉంచాలని.. యూరియా యాప్లో మార్పులు చేయాలని సూచించారు. అందుకు వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలు సమన్వయం చేసుకోవాలన్నారు.
CTR: జిల్లా అదనపు ఎస్పీ రాజశేఖర్ రాజు పర్యవేక్షణలో, పోలీసులు వాహన పత్రాలు, లైసెన్స్లు, హెల్మెట్ వాడకం, మద్యం తాగి వాహనాలు నడపడాన్ని తనిఖీ చేస్తున్నారు. విజిబుల్ పోలీసింగ్లో భాగంగా, ప్రజా భద్రతను, నేరాలను నిరోధించడానికి ఇంటెన్సివ్ వెహికల్ చెక్లు నిర్వహిస్తున్నారు. అలాగే అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను కూడా పర్యవేక్షిస్తున్నారు.
మార్కాపురంలోని కందుల నారాయణ రెడ్డి సమక్షంలో వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. పొదిలి మండలం కుంచెపల్లి గ్రామానికి చెందిన వరికుంట్ల పౌలు, వరికుంట్ల వినోద్ ఆధ్వర్యంలో సుమారు 15 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పొదిలి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.