BHNG: భూదాన్ పోచంపల్లి మండలం కనుముకుల గ్రామంలో శ్రీ పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం తిరు కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి హాజరయ్యారు.
WGL: నర్సంపేట డివిజన్ పరిధిలో రైతులు దరఖాస్తు చేసుకున్న సాదా బైనామా దరఖాస్తులను పరిశీలించి వెంటనే అమలు చేయాలని కోరుతూ ఇవాళ ఆర్డీవో ఉషారాణికి BJP పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా BJP జిల్లా కార్యదర్శి డా. రానా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సాదా బైనమా దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలని కోరారు.
NZB: కమ్మర్పల్లి మండలం కోనాపూర్ అటవీ ప్రాంతం నుంచి చౌట్పల్లి గ్రామానికి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ను అధికారులు పట్టుకున్నారు. వాసంగట్టు తండాకు చెందిన లకావత్ రాజేందర్ను మంగళవారం డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్, బీట్ ఆఫీసర్లు ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు అతనిపై కేసు నమోదు చేశారు.
ELR: ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలందరికీ పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ నగర అధ్యక్షుడు సోమయ్య మాట్లాడుతూ.. చిన్న చిన్న కారణాలతో రోగులను విజయవాడ, గుంటూరు ఆసుపత్రులకు రిఫర్ చేయడం సరికాదన్నారు.
NRML: లోకేశ్వరం మండలం పిప్రి గ్రామం లిఫ్ట్ ఇరిగేషన్కు రూ. 77 కోట్ల నిధులు మంజూరైనట్లు ముధోల్ MLA రామారావు తెలిపారు. ఈ లిఫ్ట్ ద్వారా పిప్రీ, నగర్, రాయపూర్ కాండ్లీతో పాటు పలు గ్రామాల రైతులకు సాగునీరు అందుతుందన్నారు. గత పాలకుల నిర్లక్ష వైఖరి మూలంగా రైతులకు అన్యాయం జరిగిందన్నారు. వచ్చే జూన్ వరకు ఈ లిప్ ద్వారా 5 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు.
KMM: అకాల వర్షాలు, ఈదురుగాలుల వల్ల దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తిర్లాపురం సర్పంచ్ వీరబాబు డిమాండ్ చేశారు. సోమవారం కురిసిన వర్షానికి మండలంలోని మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. ప్రభుత్వం స్పందించి క్షేత్రస్థాయిలో నష్టాన్ని అంచనా వేయాలని, బాధిత రైతులకు ఎకరాకు రూ. 40వేల చొప్పున పరిహారం అందించి ఆదుకోవాలని ఆయన కోరారు.
ఆసిఫాబాద్ MLA కోవ లక్ష్మీపై పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలని BRS జిల్లా నాయకులు సరస్వతీ డిమాండ్ చేశారు. మంగళవారం వారు మాట్లాడుతూ.. క్యాతన్ పల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక జరగకుండా మంత్రి వివేక్ BRS నాయకులు సుమన్, MLA కోవ లక్ష్మీలపై తప్పుడు కేసులు పెట్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. ప్రజలు తీర్పును ప్రభుత్వం శిరసావహించి ఎన్నిక నిర్వహించాలన్నారు.
KDP: ఎర్రగుంట్లలోని నాలుగు రోడ్ల కూడలిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.రోడ్డు దాటుతున్న సుమారు 80 సంవత్సరాల వయస్సు గల వృద్ధుడిని కడప రోడ్డునుంచి వేంపల్లె వైపు వెళ్తున్న ట్రిప్పర్ ఢీకొట్టింది.ఘటనను గమనించిన స్థానికులు డ్రైవర్ను అప్రమత్తం చేయగా,వాహనాన్ని ఆపి వృద్ధుడిని బయటకు తీశారు.తలకు తీవ్ర గాయాలైన వృద్ధుడిని అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు.
NDL: మహానంది దేవస్థానంలో ఈనెల 27న హుండీ కానుకల లెక్కింపు నిర్వహిస్తున్నట్లు మంగళవారం ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. శ్రీ కామేశ్వరీ దేవి సహిత శ్రీ మహానందీశ్వర స్వామి వారితో పాటు ఆంజనేయస్వామి, కోదండ రామాలయం, అన్నప్రసాద విభాగం గో సంరక్షణ విభాగాల్లోని హుండీ కానుకల లెక్కింపు ఉంటుందన్నారు. సిబ్బంది అందరూ హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.
AP: రాజమండ్రి కల్తీ పాల ఘటనలో ఐదేళ్ల బాలుడు వెంకట్ మృతిచెందాడు. విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు తుదిశ్వాస విడిచాడు. బాలుడి మృతితో కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య 5కి చేరింది.
WG: జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై కలెక్టర్ నాగరాణి మంగళవారం భీమవరం కలెక్టరేట్ నుంచి మెడికల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని విభాగాల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినా, రోగుల పట్ల అలసత్వం ప్రదర్శించినా కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
TG: ఆపరేషన్ ఆక్టోపస్ పేరిట సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఈ నేపథ్యంలో 16 రాష్ట్రాల్లో 104 మంది నిందితులను అరెస్టు చేశారు. మ్యూల్ ఖాతాదారులు, సరఫరాదారులు, బ్యాంకు అధికారులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.36 లక్షలు, 204 సెల్ఫోన్లు, 141 సిమ్లు, అలాగే 152 బ్యాంకు పాస్ పుస్తకాలు, 26 ల్యాప్టాప్లు జప్తు చేశామని తెలిపారు.
NTR: నందిగామలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన కుమ్మెర మల్లన్న స్వామి జాతరలో రెండు నెలల చిన్నారి మృతి ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయ దర్శనానికి వెళ్లిన కుటుంబంపై దాడి చేసి చిన్నారిని తొక్కడం అమానుషమని ఖండించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించి బాధ్యులపై చర్య తీసుకోవాలన్నారు.
అన్నమయ్య: కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని పెద్దమండ్యం మండల అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. మంగళవారం తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ హెల్పర్స్, వర్కర్స్ యూనియన్ CITU, IFTU ఆధ్వర్యంలో తంబళ్లపల్లె ICDS ఆఫీస్ ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మే నెల మొత్తం సెలవులు ఇవ్వాలన్నారు.
విశాఖలోని Andhra Medical Collegeకు యూకేలో స్థిరపడిన డాక్టర్ ఐ.కే. రాజు యూరాలజీ విభాగానికి ఆధునిక వైద్య పరికరాలు విరాళంగా అందజేశారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ. వాణి సమక్షంలో డీజే స్టెంట్లు, గైడ్ వైర్లు, కాథెటర్లు అందజేశారు. ఈ పరికరాలు నిరుపేద రోగులకు ఎంతో ఉపయోగపడతాయని విభాగాధిపతి డాక్టర్ ఐ. చంద్రశేఖర్ తెలిపారు.