కృష్ణా: గుడివాడ పురపాలక కమిషనర్ ఎస్. మనోహర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్, ఏఈ, శానిటరీ ఇన్స్పెక్టర్, సచివాలయ సిబ్బందితో కలిసి కర్మికానగర్, సాయినగర్, చెంచుపేట ప్రాంతాలలో పర్యటించారు. శనివారం ఉదయం స్థానిక ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సరఫరా వ్యవస్థను సమీక్షించి, లీకేజీలు ఉంటే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
MBNR: బాలానగర్ మండలం పెద్దాయపల్లి పరిధిలోని ఏకలవ్య మోడల్ స్కూల్ ప్రవేశాల దరఖాస్తు గడువును ఈనెల 25 వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ సుభాష్ శుక్ల తెలిపారు. శుక్రవారంతో గడువు ముగియడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలోని 5వ తరగతి చదువుతున్న ST విద్యార్థిని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
మార్కాపురం జిల్లా కనిగిరిలో దళితుల భూమిని రాత్రిపూట ఫినిషింగ్ రాళ్లతో అక్రమంగా కబ్జా చేశారని స్థానిక దళితులు ఆరోపిస్తున్నారు. ఈ భూ-కబ్జాపై ల్యాండ్ గ్రాబింగ్, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పోలీస్, రెవెన్యూ శాఖలు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
NZB: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ 5వ తరగతి ప్రవేశ పరీక్ష రేపు ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ చంద్రిక తెలిపారు. ఆర్మూర్ కేంద్రంలో 504 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. అభ్యర్థులు హాల్ టికెట్, పెన్ను, గుర్తింపు కార్డుతో ఉదయం 9:30 గంటలకే కేంద్రానికి చేరుకోవాలని ఆమె సూచించారు.
AKP: పరవాడ మండలం తానాం గ్రామంలో శుక్రవారం రాత్రి షటిల్ బ్యాట్మెంటన్ పోటీలను మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ప్రారంభించారు. గ్రామంలో పరదేశిమాంబ జాతర సందర్భంగా పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులకు తగిన ప్రోత్సహం అందించినందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
అల్లూరి: శుక్రవారం రాత్రి అరకు ఎన్టీఆర్ జంక్షన్ వద్ద రోడ్ అవేర్నెస్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించామని సీఐ ఎల్.హిమగిరి తెలిపారు. వాహన తనిఖీలు నిర్వహించారు. కొంతమంది నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలకు గురై, ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. దీంతో ఎన్నో కుటుంబాలు నష్టపోతున్నాయన్నారు. క్షేమంగా గమ్య స్థానాలకు చేరేందుకు డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు.
WNP: విద్యార్థులు తమ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలంటే ప్రణాళికాబద్ధమైన చదువు అవసరమని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. శుక్రవారం పెద్దమందడి మండలంలో గురుకుల విద్యార్థులకు ఆయన మోటివేషన్ తరగతులు నిర్వహించారు. చదువును భారం కాకుండా ఇష్టపడి చదవాలని, లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు.
BDK: గార్ల మండలంలో ఇల్లందు నియోజకవర్గ కోరం కనకయ్య పర్యటిస్తారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధనియాకుల రామారావు శుక్రవారం ప్రకటించారు. ముందుగా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎమ్మెల్యే పంపిణీ చేస్తారని అన్నారు. అలాగే ITDA నుంచి గిరిజనులకు మంజూరు అయిన ఇందిరమ్మ ఇండ్ల ప్రాసెసింగ్ను ప్రవేశ పెట్టనున్నట్లు వెల్లడించారు.
HYD: హుస్సేన్ సాగర్లో ఈరోజు ఉదయం తేలియాడుతున్న ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని లేక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్టీఆర్ గార్డెన్ ఎదురుగా మృతదేహం తేలియాడుతుందన్న సమాచారం మేరకు పోలీసులు వెళ్లి వెలికితీశారు. మృతుడి దగ్గర ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదని, మృతదేహాన్ని గుర్తింపు నిమిత్తం గాంధీ మార్చురీలో భద్రపరిచామని పోలీసులు తెలిపారు.
AO: లంచం తీసుకుంటూ మరో అధికారి ACBకి చిక్కాడు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో మెడికల్ షాప్ పెట్టుకునేందుకు అనుమతి అడిగిన వ్యక్తి నుంచి డ్రగ్ ఇన్స్పెక్టర్ కంపా సురేష్ రూ.20 లంచం అడిగాడు. బాధితుడు ACBని ఆశ్రయించడంతో.. శుక్రవారం సురేష్ను అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సురేష్, అలాగే అతనికి సహాయం చేసిన శివరామకృష్ణ అనే వ్యక్తినీ అరెస్ట్ చేశారు.
ELR: ద్వారకతిరుమల మండలం గొల్లగూడెంలో నిర్వహిస్తున్న వ్యభిచారం గృహంపై ఎస్సై సుధీర్ తన సిబ్బందితో కలిసి శుక్రవారం ఆకస్మిక దాడులు చేశారు. ఎస్సై మాట్లాడుతూ.. పంచవ నాగమణి, భర్త సునీల్ గృహంలోనే విటులను రప్పించి అసాంఘిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని వచ్చిన సమాచారంతో ఇద్దరూ విటులను, ఒక బాధితురాలను అదుపులోకి తీసుకున్నామన్నారు.
WGL: ఎనుమాముల మార్కెట్ యార్డును నిన్న సాయంత్రం జిల్లా కలెక్టర్ డా. సత్య శారద సందర్శించారు. మిర్చి సీజన్ నేపథ్యంలో మార్కెట్కు పెద్ద సంఖ్యలో వస్తున్న రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. మార్కెట్ యార్డులో తాగునీటి సదుపాయం, తగిన షెడ్లు, తూకం ప్రక్రియలో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
NTR: గత రెండు నెలల క్రితం టీడీపీ సీనియర్ కార్యకర్త ఇప్పిలి రాంబాబు గుండెపోటుతో మరణించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా ఆయన కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయంగా రూ.10,000 / చెక్కును నిన్న అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఏ అవసరం వచ్చిన తమను సంప్రదించాలని రాంబాబు కుటుంబ సభ్యులను కోరారు.
KRNL: గూడూరు నగర పంచాయతీ SC కాలనీలో SI రాజ కుళ్లాయప్ప సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలపై జరుగుతున్న దాడులు, IVRS కాల్స్, నకిలీ రుణాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళలపై దాడులకు పాల్పడితే సహించేది లేదని, అటువంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. అనుమానిత కాల్స్ విషయంలో జాగ్రత్త వహించాలని కోరారు.
అన్నమయ్య: ఏడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో ఏ2 ముద్దాయిగా ఉన్న కులవర్ధన్ తల్లి అంజలిని పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు మదనపల్లి డీఎస్పీ మహేంద్ర శుక్రవారం తెలిపారు. కేసు అత్యంత దారుణంగా జరిగినదని, మైనర్ బాలికను పరిగణనలోకి తీసుకోకుండా అగంతకుడు కులవర్ధన్ బాలికను హత్యకు గురిచేశాడని పేర్కొన్నారు. చట్టం తన పని తానే చేస్తుందన్నారు.