• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ప్రతి సోమవారం యధావిధిగా ప్రజావాణి: కలెక్టర్

VKB: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి ఇకనుంచి యధావిధిగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి గత కొన్ని వారాలుగా మున్సిపల్ ఎన్నికలు ఉన్నందున నిలిపివేశారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని సమస్యలు పరిష్కరించుకోవాలని కలెక్టర్ సూచించారు.

February 22, 2026 / 10:08 AM IST

లైన్ క్లియర్ కోసం విద్యుత్ అంతరాయం

GDWL: శాంతినగర్‌-2 33 కేవీ ఫీడర్ కింద తాకే చెట్ల కొమ్మలను తొలగించడానికి, 33/11 కేవీ రాజోలి సబ్ స్టేషన్లో మెయింటెనెన్స్‌కి లైన్ క్లియర్ (LC) తీసుకుంటామని ఏఈ హరి శనివారం ప్రకటించారు. రాజోలి, తూర్పు, పడమటి గార్లపాడు, తుమ్మలపల్లి గ్రామాలకు ఆదివారం మధ్యహ్నం ఒంటి గంట నుంచి సాయత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు.

February 22, 2026 / 10:08 AM IST

శ్రీ స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న మంత్రి

ELR: శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున స్వామి, అమ్మవార్లను గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ రాజగోపురం వద్ద అధికారులు మంత్రికి ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచననలు అందజేసి శేష వస్త్రం, లడ్డూ ప్రసాదాలు, చిత్రపటంతో మంత్రిని సత్కరించారు.

February 22, 2026 / 10:07 AM IST

పవన్ కళ్యాణ్ దత్తత గ్రామానికి కొత్తదశ

AP: డిప్యూటీ సీఎం పవన్ చొరవతో నంద్యాల జిల్లా కొణిదెల గ్రామంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. 2019 ఎన్నికల సమంలో ఆయన కర్నూలు జిల్లా పర్యటనలో ఉండగా కొణిదెల గ్రామస్థులు తమ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని కోరారు. అందుకు పవన్ సానుకూలంగా స్పందించి గతేడాది అభివృద్ధికి రూ.50 లక్షల విరాళం అందించారు. ఆ నిధులతో అక్కడ 90 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న ఓవర్ హెడ్ నీటి ట్యాంకు నిర్మించారు.

February 22, 2026 / 10:06 AM IST

కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక పై ఉత్కంఠ

BHPL: మున్సిపాలిటీ ఎన్నికలు ముగియడంతో కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక పై అందరి దృష్టి సారించారు. 30 వార్డులున్న మున్సిపాలిటీలో నలుగురు కో-ఆప్షన్ సభ్యులకు అవకాశం దక్కనుంది. నిబంధనల ప్రకారం ఇద్దరు మైనారిటీలకు, ఒకరు మాజీ కౌన్సిలరుకు కేటాయించాలి. ఇందులో ఒక స్థానం మహిళకు రిజర్వ్ అవుతుంది. అధికార కాంగ్రెస్ పార్టీలో ఈ పదవులకు తీవ్ర పోటీ నెలకొంది.

February 22, 2026 / 10:04 AM IST

చిక్కాలవలసలో విషాద ఛాయలు

SKLM: నరసన్నపేట(M) చిక్కాలవలస కి చెందిన అమృత్ కుమార్ CRPF జవాన్ మణిపూర్ లో విధి నిర్వహణలో గుండెపోటుతో మరణం చెందారు. ఆయన పార్థివదేహాన్ని అధికారులు ఆదివారం స్వగ్రామానికి తీసుకువచ్చారు. జడ్పిటిసి కృష్ణ చైతన్య మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జవాన్ అంతిమయాత్రలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయ.

February 22, 2026 / 10:03 AM IST

స్వర్ణోత్సవాలకు కేయూ సిద్ధం..!

వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయాన్ని 1976లో స్థాపించారు. 50వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా స్వర్ణోత్సవాలకు సిద్ధమవుతోంది. ఉన్నత విద్యను అందిస్తూ NAAC నుంచి A+ గ్రేడ్ గుర్తింపు పొందింది. 27 విభాగాలు, అనేక అనుబంధ కళాశాలలతో ఇంజినీరింగ్, ఫార్మసీ, ఆర్ట్స్, సైన్స్‌లో సుమారు 95+ కోర్సులను అందిస్తోంది.UG, PG, Ph.Dతో పాటు దూరవిద్య కోర్సులు అందిస్తుంది.

February 22, 2026 / 10:02 AM IST

వేమగిరిలో మొదలైన ఆధ్యాత్మిక వైభవం

E.G: కడియం మండలం వేమగిరిలో ఆధ్యాత్మిక వైభవం మొదలైంది. కెవిఆర్ లేఔట్‌లో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పూలరథంపై భక్తులు ఊరేగించారు. వందలాదిమంది మహిళా భక్తులు సంప్రదాయ పసుపు చీరలు ధరించి చేత కాషాయ జెండాలు పట్టి నమో వెంకటేశా అంటూ ముందుకు సాగారు. ఈనెల 26వ తేదీన ఆలయ ప్రతిష్ట జరగనుంది.

February 22, 2026 / 10:01 AM IST

సీఎం రేవంత్ రెడ్డి పర్యటన వివరాలు ఇలా..

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇవాళ CM రేవంత్ రెడ్డి పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యహ్నం 1:30 గం HYD నుంచి MHBD జిల్లాకు రానున్నారు. మ. 2:15 గంగారం మండలం రెడ్యాల గ్రామానికి వెళ్తారు. 3 గం ములుగు జిల్లాకు రానున్నారు. 3:30 దేవాదాల ప్రాజెక్టును పరిశీలించి అక్కడ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. సాయత్రం 5 గంటలకు HYDకి తిరిగి వెళ్తారు.

February 22, 2026 / 10:00 AM IST

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

GNTR: రాష్ట్రంలోని పేద ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అత్యంత శ్రద్ధ తీసుకుంటుందని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు. పొన్నూరు మండల పరిధిలోని 25 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆదివారం రూ. 13,15,872/- చెక్కులను పంపిణీ చేశారు. లబ్ధిదారులు చెక్కులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

February 22, 2026 / 10:00 AM IST

ప్రారంభమైన ఉరవకొండ గవిమఠం బ్రహ్మోత్సవాలు

ATP: ఉరవకొండ గవిమఠం శ్రీచంద్రమౌళీశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు శనివారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. మఠం ప్రాంగణంలో అర్చకుల మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా గంగపూజ, కంకణధారణ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కరిబసవేశ్వర స్వామి జీవసమాధి వద్ద నాగపూజ జరిపారు. నేడు స్వామివారు వివిధ వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.

February 22, 2026 / 10:00 AM IST

‘రాష్ట్ర వనరులన్నీ వైసీపీ నేతలు దోచుకున్నారు’

KKD: గత YCP ప్రభుత్వం రాష్ట్రంలో ల్యాండ్, సాండ్, వైన్, మైన్ ఇలా అన్ని వనరులను దోచుకుందని కాకినాడ MLA వనమాడి కొండబాబు ఆరోపించారు. శనివారం TDP కార్యాలయంలో కూటమి నేతలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. చివరికి తిరుమల లడ్డూను కూడా వదలలేదని విమర్శించారు. కల్తీ జరిగిన విషయాన్ని మాజీ ఛైర్మన్ సుబ్బారెడ్డి అంగీకరించారని తెలిపారు.

February 22, 2026 / 10:00 AM IST

‘నీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు’

ఆదిలాబాద్ పట్టణంలో వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి తలెత్తకుండా మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. కెఆర్‌కె కాలనీలో కౌన్సిలర్ రజిత రాము ఆధ్వర్యంలో నిరుపయోగంగా ఉన్న బోరింగులకు మరమ్మతులు చేయించారు. ఆమె మాట్లాడుతూ.. ఎండాకాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు.

February 22, 2026 / 09:59 AM IST

జాతీయ స్థాయికి రెండు పాఠశాలలు

KMR: జాతీయ స్థాయిలో స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్ (SHVR) 2025-26లో భాగంగా జిల్లా నుంచి TSNR ZPHS బాయ్స్ బీబీపేట్, MPPS మహమ్మదాపూర్ పాఠశాలలు రాష్ట్ర స్థాయిలో ఎంపికై జాతీయ స్థాయికి నామినేట్ అయినట్లు DEO రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఇరు పాఠశాల హెచ్ఎంలను ఆయన అభినందించారు. జాతీయ స్థాయిలో కూడా సెలెక్ట్ అయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

February 22, 2026 / 09:58 AM IST

ఉత్తమ నటి నివేదా థామస్‌

కొచ్చిలో జరిగిన 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల వేడుక అట్టహాసంగా సాగింది. ‘పుష్ప 2’ ప్రభంజనం సృష్టించి ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు (అల్లు అర్జున్), ఉత్తమ దర్శకుడు (సుకుమార్) అవార్డులను గెలుచుకుంది. నివేదా థామస్ (35: చిన్నకథ కాదు) ఉత్తమ నటిగా నిలిచింది. అమితాబ్ బచ్చన్ ఉత్తమ సహాయ నటుడిగా, తేజ సజ్జా, కాజల్ అగర్వాల్ క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ నటీనటులుగా అవార్డులు అందుకున్నారు.

February 22, 2026 / 09:56 AM IST