తెలంగాణలో (Telanagna) భూ సమస్యలు అనేకము ఉన్నాయని, వాటి పరిష్కారానికి పంచ సూత్రలను కాంగ్రెస్ పార్టీ సూచిస్తుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ (Jairam Ramesh) అన్నారు.119 నియోజక వర్గాలలో గ్రామాల్లో ధరణి అదాలత్ (Dharani Adalat) కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన మీడియా ద్వారా వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కానిస్టేబుల్ ఫిజికల్ ఈవెంట్లు వాయిదా(Postponement) పడ్డాయి. మార్చి 13న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 14 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, పోలీసు కానిస్టేబుల్ పీఎంటీ/పీఈటీ ఫిజికల్ ఈవెంట్లు వాయిదా వేస్తున్నట్టు పోలీస్ రిక్రూట్ మెంట్ కౌన్సిల్ వెల్లడించింది. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని, త్వరలోనే కొత్త తేదీలు ప్రకటిస్తామని వారు తెలిపారు.
మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో బస్సులోనే నిద్రిస్తున్న కండక్టర్ (Conductor) సజీవంగా మంటలకు బలి అయిపోయారు. ఈ దారుణ ఘటన బెంగళూరులోజరిగింది. బెంగళూరు (Bengaluru)మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సులో మంటలు చెలరేగడంతో ముత్తయ్య స్వామి (Muttiah Swamy) అనే కండక్టర్ సజీవ దహనమయ్యారు.
అదేదో సామెత అన్నట్టు.. సీనియర్ హీరో నరేష్, పవిత్ర అసలై దసరా పండగ చేసుకుంటున్నారు. ఎవ్వరు ఏమనుకున్నా సరే.. తగ్గేదేలే అంటున్నారు. లోకులు కాకులు అనే మాటను తు.చ.తప్పకుండా పాటిస్తున్నారు. పలు సినిమాల్లో కలిసి నటించిన.. నరేష్, పవిత్ర గత కొద్ది రోజులుగా ఘాడమైన ప్రేమలో ఉన్నారు.
స్వీట్ అంటే సాధారణంగా అందరూ ఇష్టపడతారు. అయితే స్వీట్లు ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. స్వీట్లు గుండె ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఒక అధ్యయనం ప్రకారం, ప్రసిద్ధ కృత్రిమ స్వీటెనర్ ఎరిథ్రిటాల్ వినియోగం గుండెపోటు ,స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.
Woman quickly filling baskets with orange:వీడియోలో ఓ మహిళ (woman) బాక్స్లలో ఆరెంజ్ (orange) నింపుతుంది చూస్తున్నాం. మిషన్ల నుంచి సంత్ర పండ్లు వస్తుండగా.. ఆమె వాయువేగంతో నింపేస్తున్నారు. కాలితో ఆ బాక్స్ (box) తన్నుతూ.. మరో బాక్స్ తీసుకుంటున్నారు. మిషిన్ నుంచి ఆరెంజ్ (orange) రావడం.. బాక్స్ (box) నిండటం ఎంత సమయమో.. అంతే స్పీడుగా మరో బాక్స్ పెడుతున్నారు.
తనపై వచ్చిన లైంగిక ఆరోపణలను మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య(Tatikonda Rajaiah) తీవ్రంగా ఖండించారు. ఇంటి దొంగలే శిఖండిలా మారి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలు వస్తున్నాయనే తనపై కుట్రలు చేస్తున్నారని ఆయన అన్నారు. జరిగిన విషయాలన్ని సీఎం కేసీఆర్ (Cm kcr) దృష్టికి తీసుకెళ్తానని అన్ని విషయాలను వివరిస్తానని రాజయ్య అన్నారు.
CM KCR ON PRE POLL:లిక్కర్ స్కామ్లో (Liquor scam) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను (kavitha) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించనున్న నేపథ్యంలో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం (cabinet meeting) నిన్న సమావేశమైన సంగతి తెలిసిందే. తెలంగాణ భవన్లో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ విసృత స్థాయి సమావేశం జరిగింది. సమావేశం తర్వాత పార్టీ అధ్యక్షులు సీఎం కేసీఆర్ (cm kcr) మీడియాతో మాట్లాడారు.
టిట్టర్లో ఆస్క్ కేటీఆర్ (Ask KTR on Twitter)నిర్వహించి నెటిజన్లకు టచ్ లో ఉంటారు మంత్రి కేటీఆర్. తాజాగా ఓ మహిళా ప్రయాణికురాలు ట్వీట్ పై మంత్రి కేటీఆర్ స్పందించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secunderabad Railway Station)వద్ద మెట్రో, బస్సు సర్వీసులు అందుబాటులో లేని సమయంలో అంటే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మహిళలకు క్యాబ్ లేదా ఆటో సర్వీసులు(Cab or auto services) ఏర్పాటు చేయాలని కోరారు.
Hot summer:మార్చి వచ్చింది.. కొన్ని చోట్ల వాతావరణం కాస్త చల్లగా ఉన్నా.. మరికొన్ని చోట్ల మాత్రం ఎండ వేడిమి ఉంది. ఉదయం 10 దాటితే చాలు భానుడి భగ భగలు కొనసాగుతున్నాయి. దైవభూమి కేరళలో రికార్డు స్థాయిలో 54 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా చోట్ల కూడా ఎండ ప్రభావం ఉంది.
Avinash reddy:మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి కాస్త ఊరట కలిగింది. ఈ కేసులో ఇప్పటికే ఆయనను పలుమార్లు సీబీఐ విచారించింది. అయితే ఈ రోజు కూడా విచారించాల్సి ఉంది. ఇంతలో సీబీఐ అధికారుల తీరు గురించి అవినాష్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దానికి సంబంధించి సోమవారం వరకు ఆయనను అరెస్ట్ చేయొద్దని సీబీఐ అధికారులకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
దేశంలో కొత్తగా 326 మందికి కరోనా కేసులు (Corona cases) సోకినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ(Central Health dept )వెల్లడించారు. కేరళలో (Kerala) అత్యధికంగా 1474, కర్ణాటకలో 445, మహారాష్ట్రలో 379 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీంతో 67 రోజులు తర్వాత యాక్టివ్ రోగుల (Active patients) సంఖ్య 3,000 దాటింది. దేశంలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 5,30,775 కాగా, యాక్టివ్ కేసులు 3,076కి చేరుకున్నాయి.
Manish Sisodia:ఢిల్లీ లిక్కర్ స్కామ్లో (delhi liquor scam) మనీశ్ సిసోడియాది (manish sisodia) ప్రత్యక్ష పాత్ర ఉందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఢిల్లీ రోస్ అవెన్యూ కోర్టుకు తెలిపింది. కొందరి వ్యక్తిగత ప్రయోజనం కోసం లిక్కర్ పాలసీ రూపొందించారని పేర్కొంది. ప్రజల నుంచి అభిప్రాయం తీసుకోకుండానే హోల్సేల్ (wholesale) వ్యాపారులకు 12 శాతం లాభం చేకూర్చేందుకు పాలసీ రూపొందించారని వివరించింది.
YS Sharmila : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. దేశరాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఆమె దీక్షకు చాలా మంది మహిళలు మద్దతు పలుకుతున్నారు. కాగా... కవిత దీక్ష పై షర్మిల సెటైర్లు వేశారు. కవిత దీక్ష చేయాల్సింది ఢిల్లీలో కాదని..కేసీఆర్ ఇంటి ముందని షర్మిల అన్నారు.
ఈడీ(ED)కి ఇచ్చిన వాంగ్మూలాలను ఉపసంహరించుకుంటూ హైదరాబాద్(hyderabad) వ్యాపారవేత్త అరుణ్ పిళ్లై(Ramachandra Pillai) ఢిల్లీ(delhi) కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో కోర్టు ఈడీ ఏజెన్సీకు నోటీసులు జారీ చేసింది. అయితే అరుణ్ పిళ్లై కవిత బినామీగా ఉన్నట్లు గతంలో ఈడీ(ED)కి తెలిపాడు. ఇప్పుడు అదే వాంగ్మూలం వెనక్కి తీసుకోవడం పట్ల రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.