1990లలో తెలుగు దేశం పార్టీలో లక్ష్మీ పార్వతి వ్యవహరించినట్లుగా ఇప్పుడు వైసీపీలో సజ్జల రామకృష్ణా రెడ్డి కనిపిస్తున్నారని ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.
Nikhat zareen:ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్లో గోల్డ్ మెడల్ గెలిచిన నిఖత్ జరీన్ను (Nikhat zareen) ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ (kcr).. ఇతర ప్రముఖులు విష్ చేశారు. మహీంద్రా (mahindra) కంపెనీ ఆమెకు థార్ కారు (thar) ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ మేరకు ట్వీట్ చేసింది.
కరెంట్ బిల్లు కట్టలేదని ఓ వృద్ధ మహిళను వేధించిన డిస్కమ్ స్టాఫర్స్ ను సస్పెండ్ (staffers of a power distribution company were suspended) చేశారు. బిల్లు వసూలు (Power Bill) చేసేందుకు పద్ధతి ఉంటుంది.
తన తండ్రి డీ శ్రీనివాస్ రాజీనామా వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు, బీజేపీ నేత ధర్మపురి అరవింద్ వివరణ ఇచ్చారు.
ఆంధ్ర ప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారామ్ పైన తెలుగు దేశం పార్టీ రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. గౌరవప్రదమైన స్పీకర్ పదవిలో ఉన్నారని, కానీ డిగ్రీ తప్పుడు సర్టిఫికెట్ సమర్పించి మూడు సంవత్సరాల న్యాయ విద్యలో అడ్మిషన్ పొందినట్లు శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షులు కూన రవి కుమార్ ఫిర్యాదు చేశారు.
TSPSC మరో ప్రధాన నిందితుడైన ప్రవీణ్ (Praveen) ఇంట్లో అధికారులు 5 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు సిట్ అధికారులు (SIT officials) తెలిపారు. ప్రవీణ్ ఇంట్లో సోదాలు జరపగా..శంకర లక్ష్మి డైరీ నుంచి పాస్వర్డ్ (password) చోరీ చేసినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. దీంతో కంప్యూటర్లో(Computer) ఉన్న ప్రశ్నాపత్రాల సమాచారాన్ని చోరీ చేసినట్లు గుర్తించారు.
ముఖ్యమంత్రి జగన్ తో (CM JAGAN) ప్రపంచబ్యాంకు ప్రతినిధి బృందం భేటీ అయింది. భారత్ లో ప్రపంచబ్యాంకు డైరెక్టర్ (Auguste Tano Koume) నేతృత్వంలో బృందం భేటీ జరిగింది. ప్రపంచబ్యాంకు ఆర్థిక సహాయంతో అమలవుతున్న మూడు కార్యక్రమాలపై సమీక్ష చేశారు. ఏపీ ప్రజారోగ్య బలోపేతం, ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ (సాల్ట్), ఏపీ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్(ఏపీఐఐఏటీపీ) ప్రాజెక్ట...
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు బీజేపీ(BJP) నేతను నరికి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పాండిచ్చేరి హోం మినిస్టర్ నమశ్శివాయం బంధువైన సెంథిల్ కుమార్(Senthil kumar)ను విల్లియానూర్ అనే రద్దీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. రద్దీ ప్రాంతంలో రోడ్డు పక్కన ఆయన టీ తాగుతుండగా అంతలోనే ఏడుగురు దుండగులు బైకులపై అక్కడికి చేరుకున్నారు.
తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ(Weather Department) రెయిన్ అలర్ట్(Rain alert) జారీ చేసింది. ఏపీ(AP), తెలంగాణ(Telangana) రాష్ట్రాలకు వాన(Rain) ముప్పు పొంచి ఉంది. ఉపరితల ద్రోణి, అల్పపీడన ప్రభావంతో మరో రెండు రోజుల పాటు ఏపీ, తెలంగాణలో వర్షాలు(Rain) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్(yell...
తెలంగాణ (Telanagna) బీజేపీ చీఫ్ బండి సంజయ్ (Bandi Sanjay)పై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని బ్రోకర్ అని మాట్లాడుతున్నాడు. నేను కూడా అనలేనా? నీ ప్రధానమంత్రి మోదీ (PM MODI).. అదానీకి బ్రోకర్ అని నేను అనలేనా? కానీ అలా నేను అనను. మాకు సంస్కారం ఉంది. దేశమంతా అంటుంది. కానీ నేను అననను. బ్రోకర్, లోఫర్, లుచ్చా.. ఇలాంటి మాటలను అనడం మాకు రాదా? మాకు చేతగాదా?...
రావణాసుర చిత్రం గురించి నటి ఫరియా అబ్దుల్లా(Actress Faria Abdullah)తో ఇంటర్వ్యూ మీ కోసం
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మండలి ఎన్నికల ఫలితాల తరువాత సీఎం జగన్ (CM JAGAN) కొత్త నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. ఈ ఉదయం ప్రకాశం జిల్లాలో(Prakasam District) పర్యటన ముగించుకున్న సీఎం జగన్ సాయంత్రం విజయవాడ(Vijayawada) వచ్చారు. సీఎం జగన్ రాజ్ భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ను (Governor Abdul Nazir) కలిశారు.
రాహుల్ గాంధీ(Rahul gandhi)పై ఎంపీగా అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఏప్రిల్ 22లోగా ఢిల్లీలోని లుటియన్స్ అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని లోక్సభ హౌసింగ్ కమిటీ కోరింది. ప్రభుత్వం కేటాయించిన బంగ్లాను ఖాళీ చేయాలని లోక్సభ హౌసింగ్ కమిటీ సోమవారం రాహుల్ గాంధీకి నోటీసు జారీ చేసింది.
ఆర్బీఐ(RBI) ప్రకటించిన ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవు. ఆయా ప్రాంతీయ వేడుకలు, పండగల ప్రకారంగానే సెలవులు(Holidays) ఉంటాయి. దేశ వ్యాప్తంగా చూస్తే అన్ని బ్యాంకు(Banks)లకు కూడా పబ్లిక్ హాలిడేస్(Public Holidays) మాత్రం కామన్గానే ఉంటాయని బ్యాంకు కస్టమర్లు(Bank Customers) గమనించాలి. ఏప్రిల్ నెలకు సంబంధించి బ్యాంకు సెలవులు ఏవో ఇప్పుడు చూద్దాం.
కర్ణాటక (Karnataka) బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప (BS Yediyurappa) ఇంటి ముందు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యా, ఉద్యోగాల రిజర్వేషన్ విషయంలో కన్నడ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్దానికంగా ఆందోళనలు చేలరేయి. కర్ణాటకలో ఎస్సీల రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి రిటైర్డ్ జడ్జి సదాశివ కమిషన్ (Sadashiva Commission) ఇచ్చిన నివేదిక విషయంలో ఆందోళనలు జరుగుతున్నాయి.