ప్రకాశం జిల్లా మార్కాపురంలో(Markapuram) కొత్తగా ఓ హోటల్ ప్రారంభించారు. అయితే మొదటి రోజు కావడంతో అదిరిపోయే ఆఫర్ ప్రకటించి భోజన ప్రియులను టెంప్ట్ చేశారు. ఒక్క రూపాయి నోట్ ఉంటే చాలు చికెన్ బిర్యానీ (ChickenBiryani)పార్శిల్ తీసుకెళ్లొచ్చని ప్రకటించారు. అంతే ఇక రూపాయి నోట్ ఇచ్చి బిర్యానీ తీసుకెళ్లేందుకు మాసం ప్రియులు ఉదయం నుంచే హోటల్ ముందే క్యూ కట్టారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు వేళ బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు రాసలీలల ఫోటోలు బయటకు వచ్చాయి. దీనిపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాంగ్రెస్ ముఖ్య నేత ఏకే ఆంటోని కుమారుడు.. అనిల్ ఆంటోని బీజేపీలో చేరారు. తనకు చాలా బాధగా ఉందని ఏకే ఆంటోని అన్నారు.
తెలంగాణ (Telanagna) రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని మంత్రి హరీశ్రావు (Minister Harish Rao) అన్నారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం పరిధిలోని ఎల్గోయి గ్రామంలో నూతనంగా రూ.1.70 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్(sub station) ను ప్రారంభించారు.
నాటు నాటు’ పాటతో (Natu Natu' song) విశ్వవేదికపై తెలుగోడి సత్తాచాటిన సంగీత దర్శకులు కీరవాణి(Keeravani),రచయిత చంద్రబోస్ను తెలుగు సినీ పరిశ్రమ సన్మానించనుంది. ఈ నెల 9వ తేదీన శిల్పకళా వేదికలో (Silpakala vedika) సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ (Damodar Prasad) తెలిపారు.
సలేశ్వరం జాతరలో (Salesvaram jatara) విషాదం చోటు చేసుకుంది. ఊపిరి ఆడక ముగ్గురు భక్తులు మృతి చెందారు. తెలంగాణ అమర్ నాథ్ యాత్రగా(Amarnath Yatra) పేరొందిన సలేశ్వరం జాతరలో అపశృతి చోటు చేసుకుంది. నాగర్ కర్నూల్ (Nagar Kurnool) పట్టణానికి చెందిన గొడుగు చంద్రయ్య (55) గుండెపోటుతో మృతిచెందాడు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తుంది. కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ విజయంపై విశ్వాసంతో ఉన్నారు. 141 సీట్లు గెలుచుకుని అధికారం చేపడుతామని పేర్కొన్నారు.
Bandi Sanjay : పదో తరగతి ప్రశ్నా ప్రతాలు లీకైన వ్యవహారంలో బీజేపీ నేత బండి సంజయ్ ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా... బండి సంజయ్ పై తాజాగా బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన కామెంట్ చేశారు. ఈ కేసులో సంజయ్ ను విడిచిపెట్టవద్దన్నారు. మునుపటి నేరాలకు సంబంధించి ఆయనపై పీడీ యాక్ట్ కూడా పెట్టాలన్నారు. అధికారం కోసం బీజేపీ ఎంతకైనా దిగజారుతుందని విమర్శించారు.
వందే భారత్ రైలుపై(Vande Bharat Train) మరోసారి రాళ్ల దాడి (Stone attack) జరిగింది. సికింద్రాబాద్, విశాఖ మధ్య నడుస్తున్న గుర్తు తెలియని వ్యక్తి ట్త్రెన్ పై రాయి విసరడంతో ఒక బోగి అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటన సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు (Railway Police) నిందితుడిని గుర్తించేందుకు విచారణ చేపట్టారు.
మంచు మనోజ్ తన నోటి దురుసును ప్రదర్శించారు. మీడియా ప్రతినిధులపై విరుచుకుపడ్డారు.
తెలంగాణలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological Centre)హెచ్చరించింది. ఈ మేరకు ఆరెంజ్ అలెర్ట్ (Orange Alert) జారీ చేసింది. రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానాలు (rains) కూరిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోసారి వర్షాలు దంచి కొట్టనున్నట్టు తెలుస్తోంది.
పదో తరగతి హిందీ పేపర్ లీకేజ్ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ రోజు ఆయనను భార్య అపర్ణ ములాఖత్ సందర్భంగా కలిశారు..
Harish Rao : ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన ఖరారు అయ్యింది. ఆయన ఈ నెల 8వ తేదీన తెలంగాణ కు రానున్నారు. కాగా.. ఆయన పర్యటన నేపథ్యంలో... మోదీ పై మంత్రి హరీష్ రావు సెటైర్లు వేశారు. మోదీ పర్యటనపై ఎద్దేవా చేశారు. ఎయిమ్స్ లో నాలుగేళ్ల క్రితం మెడికల్ కాలేజీ వస్తే ప్రధాని మోదీ ఇప్పుడు వచ్చి కొబ్బరికాయ కొడతారట, ఈ నాలుగేళ్లు ఏం చేశారని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.
ఏపీ (AP) ప్రభుత్వ వాహనాల రిజిస్ట్రేషన్లుకు సంబంధించి జగన్ సర్కార్ (Jagan Sarkar) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ వాహనాలకు కొత్త సిరీస్ తో నెంబర్లు కేటాయించనున్నారు. అందుకోసం మోటార్ వాహనాల చట్టంలో సవరణ తీసుకురానున్నారు. ఆ మేరకు రాష్ట్ర రవాణ శాఖ (Department of Transport) నోటిఫికేషన్ జారీ చేసింది.
RS Praveen Kumar : పదో తరగతి ప్రశ్నా ప్రతాలు లీకైన వ్యవహారంలో బీజేపీ నేత బండి సంజయ్ ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా... బండి సంజయ్ పై తాజాగా బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన కామెంట్ చేశారు.