కడప జిల్లాలోని భారతి సిమెంట్స్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భూములు కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవాలని గ్రామస్థులు ఆందోళనకు దిగగా, జీతాలు సరిపోవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వాసితులకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు.
BDK: మణుగూరు మండలం అశోక్ నగర్లో చేపట్టిన ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని వైద్యులు పుల్లారెడ్డి సందర్శించారు. మన ఇంటి పరిసరాల్లో దోమలు పుట్టకుండా అవి పుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మణుగూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు పుల్లారెడ్డి, సునీల్ తెలిపారు. అనంతరం హాస్టల్ లోని కిచెన్, స్టాక్ రూమ్లను పరిశీలించి తగు సూచనలు చేశారు.
E.G: వైసీపీ శాసనమండలి సభ్యులు, మాజీ సీఎం జగన్ హిందువుల మనోభావాలు దెబ్బతీశారని వెంటనే వారు క్షమాపణ చెప్పాలని నిడదవోలు MLA, మంత్రి కందులు దుర్గేష్ శుక్రవారం డిమాండ్ చేశారు. శాసనమండలిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అవమానిస్తూ, స్వామి వారి చిత్రపటాలు విసిరేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. హిందూ దేవతలను అవమానించడమే వైసీపీ లక్ష్యం అని మంత్రి అన్నారు.
MNCL: బెల్లంపల్లి పట్టణం బాబు క్యాంపు బస్తిలో శుక్రవారం మరణించిన చెందిన విశ్రాంత సింగరేణి ఉద్యోగి బింగి అశోక్ కుమార్ కళ్ళను జానహిత సేవా సమితి ఆధ్వర్యంలో ఎల్వీ ప్రసాద్ హైదరాబాద్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు దానం చేశారు. మృతి చెందినా ఇతరులకు కంటి చూపు అందించి వారికి వెలుగును అందించడానికి నేత్రదానం చేసినట్లు మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు.
SRCL: బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర కార్య దర్శిగా కొప్పుల అజయ్ నియమితులయ్యారు. ఈ మేరకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య ఉత్తర్వులు జారీ చేశారు. వేములవాడ పట్టణానికి చెందిన కొప్పుల అజయ్ బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం కార్యదర్శిగా నియమితులు కావడం పట్ల స్థానిక బీసీ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
RR: ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపించారని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగాలని MLA వీర్లపల్లి శంకర్ అన్నారు. SDNR మున్సిపల్ ఛైర్మన్గా బస్వం పదవి బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో మాట్లాడుతూ.. వార్డుల వారిగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూడాలన్నారు.
KNR: శంకరపట్నం మండలం కేశవపట్నం నుంచి ముత్తారం వైపు వెళ్తున్న ఓ సీడ్ కంపెనీకి చెందిన బొలెరో వాహనం బోల్తా పడింది. మార్గం మధ్యలో వాహనం అదుపుతప్పడంతో పంటపొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బొలెరో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. సీడ్ యాజమాన్యం బోల్తా పడ్డ వాహనాన్ని క్రేన్ సహాయంతో బయటకు తీసింది
‘కల్కి’ దర్శకుడు నాగ్ అశ్విన్.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కోసం ఒక భారీ కథను సిద్ధం చేశాడట. ఇది ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’కి సీక్వెల్ లేదా పక్కా మైథలాజికల్ డ్రామా అని టాక్ నడుస్తోంది. వైజయంతీ మూవీస్ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్టుకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, తెలుగు సినిమాలో మరో అద్భుత దృశ్యకావ్యం ఖాయమని సినీ వర్గాలు పేర్కొన్నాయి. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.
TG: ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఏఐ సమ్మిట్లో CM రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రపంచంలోని టెక్నాలజీ దిగ్గజాలన్నీ ఈ సదస్సుకు వచ్చాయి. ఆలోచనలే మన జీవితాన్ని మార్చేస్తాయి. వ్యాక్సిన్లు, విమానాల వంటి ఆవిష్కరణలు ప్రపంచాన్ని మార్చాయి. మనిషికి ఎన్నో పరిమితులు ఉండొచ్చు. ఇప్పుడు మనిషి అత్యున్నత ఆవిష్కరణ అయిన AI ఫలితాలు మనం చూస్తున్నాం’ అని అన్నారు.
కృష్ణా: గుడివాడ లోని కార్మికానగర్, సాయినగర్, చెంచుపేట ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ మనోహర్ శుక్రవారం పర్యటించారు. స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం తాగునీటి సరఫరా వ్యవస్థను సమీక్షించి, ఎక్కడైనా లీకేజీలు ఉన్నట్లయితే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే గుర్తించి సరిదిద్దాలని సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
BDK: అశ్వారావుపేట మున్సిపల్ కార్యాలయంలో అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొని అభినందనలు తెలిపారు. వారు మాట్లాడుతూ.. ప్రజలు ఇచ్చిన బాధ్యత ఎంతో ఉన్నత మైందని ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం పట్టణ అభివృద్ధికి కట్టుబడి పని చేయడం ప్రతి ఒక్కరికీ బాధ్యత అని గుర్తు చేశారు.
ATP: గుంతకల్లోని ఓ ప్రైవేట్ విద్యా సంస్థ ఎదుట శుక్రవారం ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి వెంకట్ నాయక్ మాట్లాడుతూ.. విద్యా సంవత్సరం పూర్తవకముందే ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థలను వెంటనే సీజ్ చేయాలని, ఫీజుల దోపిడిని అరికట్టాలని వారు డిమాండ్ చేశారు.
అన్నమయ్య: సుగవాసి ప్రసాద్ బాబు – మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మధ్య విభేదాలపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. మార్చి 2న అన్నమయ్య పార్లమెంట్ అధ్యక్షుడిగా సుగవాసి ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో, కార్యక్రమానికి మంత్రి హాజరవుతారా? అనే అంశం కార్యకర్తల్లో ఆసక్తి రేపుతోంది. నాయకుల మధ్య విభేదాలు పార్టీపై ప్రభావం చూపుతాయేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
‘కల్కి 2’ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు క్రేజీ అప్డేట్ వచ్చింది. ‘కల్కి 2’ షూటింగ్ హైదరాబాద్లో అట్టహాసంగా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇప్పటికే సెట్స్లో అడుగుపెట్టగా.. ఆయనకు సంబంధించిన కీలక సన్నివేశాలను మేకర్స్ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ప్రభాస్, సాయి పల్లవి కూడా ఈ షూటింగ్లో జాయిన్ కానున్నట్లు టాక్.
MBNR: గండీడ్ మండలం వెన్నచేడ్ గ్రామంలో రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీ గడువు సమీపిస్తుండటంతో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల లబ్ధి పొందేందుకు రైతులు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని AEO వరలక్ష్మి సూచించారు. ఆధార్ భూ యాజమాన్య పాస్బుక్, బ్యాంక్ వివరాలతో సమీప మీసేవ కేంద్రాల్లో నమోదు చేయాలని తెలిపారు. ఫిబ్రవరి 28 చివరి తేదీగా ఉండటంతో గడువులోపు నమోదు పూర్తి చేయాలని కోరారు.