NLG: చిట్యాల మండలం, ఉరుమడ్ల రైతు వేదికలో నూతనంగా ఎన్నికైన వార్డు మెంబర్లకు నిర్వహించిన మొదటి విడత శిక్షణ కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో జయలక్ష్మి హాజరై మాట్లాడుతూ శిక్షణను సద్వినియోగం చేసుకొని వార్డుల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఎంపీఓ కోటేష్, ట్రైనర్ యూసుఫ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
స్పిన్నర్లకు శివం దూబే సింహస్వప్నంగా మారాడని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. బంతి ఎక్కడ పడినా, దానిని స్టాండ్స్లోకి పంపే సామర్థ్యం దూబేకు ఉందని కొనియాడాడు. దీనివల్ల అతనికి ఎక్కడ బౌలింగ్ చేయాలో తెలియక బౌలర్లు తలపట్టుకుంటున్నారని అన్నాడు. ప్రస్తుతం టీమిండియాలో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ కంటే కూడా దూబే అత్యంత ప్రమాదకరమైన ఆటగాడని పేర్కొన్నాడు.
BHNG: భారతదేశం అంతటా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతుంటే, తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి రాజ్యాంగం అమలు అవుతుందని ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీత అన్నారు. శుక్రవారం యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో ఆమె మాట్లాడుతూ.. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ దౌర్జన్యంతో అనేక మున్సిపాలిటీలో ఛైర్ పర్సన్ సీట్లను కైవసం చేసుకుందన్నారు.
‘పుష్ప-2’ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అల్లు అర్జున్ సహా 23 మందిపై అభియోగాలు నమోదు చేస్తూ పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్షీట్ను నాంపల్లి కోర్టు తిప్పి పంపింది. ఆ ఛార్జ్షీట్లో పలు లోపాలు ఉన్నట్లు గుర్తించిన కోర్టు.. హార్డ్ డిస్క్లు, సీడీలు, పెన్ డ్రైవ్ల వంటి సాంకేతిక ఆధారాలను జతపరచకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
MBNR: దేవరకద్ర మున్సిపాలిటీ నూతన ఛైర్మన్గా దమయంతి గోవర్ధన్ రెడ్డి, వైస్ ఛైర్మన్గా యుగంధర్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి హాజరై నూతన పాలకవర్గాన్ని అభినందించారు. పట్టణ సమగ్ర అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
KNR: జిల్లా కేంద్రంలోని పురాతన పాఠశాల పరిధిలోగల జిల్లా సైన్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజియంలో పునరుద్ధరణ పనులను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. అటల్ టింకరింగ్ ల్యాబ్, రోబోటిక్ ల్యాబ్ ఏర్పాటు చేయనున్న గదులను తనిఖీ చేశారు. విద్యార్థులు తయారుచేసిన ఆర్ట్ క్రాఫ్ట్ ప్రదర్శన గురించి పలు సూచనలు ఇచ్చారు.
AP: వైసీపీ నేతలు దేవుడి పట్ల భక్తి, భయం లేకుండా ప్రవర్తిస్తున్నారని మంత్రి సంధ్యారాణి మండిపడ్డారు. ప్రజలకు జగన్, వైసీపీ నేతలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వేంకటేశ్వరస్వామి ఫొటోలు, ఫ్లకార్డులను వాడటం దుర్మార్గమన్నారు. స్వామివారి ఫొటోను ఒకరు తలకిందులుగా పట్టుకున్నారని.. నిరసన అవగానే ఇంకొకరు టేబుల్పై పడేశారని చెప్పారు.
WGL: సంగెం మండలంలోని గవిచర్ల శ్రీ గుండ బ్రహ్మయ్య స్వామి దేవాలయంలో వైభవంగా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలను నిర్వహించారు. నేడు మహోత్సవాలకు కుడా ఛైర్మన్ వెంకటరామిరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. గవిచర్ల గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని, స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఛైర్మన్ ఆకాంక్షించారు.
SRPT: సహకార సంఘాల ద్వారానే రైతులకు నేరుగా యూరియా సరఫరా చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. శుక్రవారం పెన్పహాడ్ మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. యాప్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. కేంద్రం ఉపాధి హామీని నిర్వీర్యం చేస్తోందని, విద్యుత్ సవరణ చట్టం కార్పొరేట్లకు మేలు చేసేలా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉన్నారు.
WNP: మదనాపురం మండలం దుప్పల్లి గ్రామానికి చెందిన బత్తుల లక్ష్మన్న కుమారుడి వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన రూ.లక్ష CMRF చెక్కును దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి శుక్రవారం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ఆపదలో ఉన్న వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
GNTR: మంగళగిరిలోని 6వ బెటాలియన్ APSPలో 2వ ఆల్ ఇండియా పోలీస్ సౌత్ జోన్ T20 క్రికెట్ టోర్నమెంట్ శుక్రవారం ప్రారంభమైంది. హోంమంత్రి అనిత అతిథిగా హాజరై ఈ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిత్యం ప్రజా భద్రత కోసం శ్రమించే పోలీసులకు ఇలాంటి క్రీడలు అవసరమని పేర్కొన్నారు. ఈ టోర్నమెంట్లో 6రాష్ట్రాల నుంచి మొత్తం 10 పోలీసు జట్లు పాల్గొంటున్నాయి.
NRML: తెలంగాణ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా తుర్క కాషా ముస్లిం సమాజానికి చెందిన రాయి కోత పనులు చేసే అర్హులకు రూ.60 వేలును 100% సబ్సిడీతో అందించనున్నట్లు మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి మోహన్ సింగ్ తెలిపారు. ఆసక్తి గల వారు మార్చి 1లోపు అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని, మరిన్ని వివరాలకు జిల్లా కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
ADB: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా నాణ్యతతో ఇంటి నిర్మాణం చేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు రాథోడ్ భిక్కు అన్నారు. శుక్రవారం నార్నూర్ మండల కేంద్రంలోని PVTGలకు మంజూరైన ఇళ్లను ఆయన పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ అనేక పథకాలు కల్పిస్తుందని, ప్రజలు వాటిని సద్వినియోగం చేసి లబ్ది పొందాలన్నారు.
CTR: పుంగనూరు బండ్లపల్లి గ్రామం సొసైటీ కాలనీలో సగుటూరు గంగమ్మ విగ్రహ ప్రతిష్ఠ కుంభాభిషేకం శనివారం జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శనివారం సాయంత్రం గణపతి హోమంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. ఆదివారం అమ్మవారి ప్రాణ ప్రతిష్ఠ, కుంబాభిషేకము, మహా పూర్ణాహుతి, అలంకరణ పూజా అధికారి కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు.