PLD: జిల్లా చర్లగుడిపాడులో పద్మశాలి యువకుల జంట హత్యలపై సంఘం నేతలు సీఎం చంద్రబాబును కలిశారు. శ్రీనివాసరావు, భావనరుషి కుటుంబాలకు ఆర్థిక సాయం, పక్కా ఇల్లు, ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన సీఎం, ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
BPT: ఏపీ అసెంబ్లీ సమావేశాలను రేపల్లె నియోజకవర్గ విద్యార్థులు వీక్షించారు. పేటేరు, గుళ్లపల్లి, ఉల్లిపాలెం పాఠశాలల విద్యార్థులతో మంత్రి అనగాని సత్యప్రసాద్ ముచ్చటించారు. సభ తీరు, సమస్యల ప్రస్తావనపై వారిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రజాస్వామ్య విలువలపై అవగాహన కల్పించడం ఎంతో అవసరమన్నారు. అనంతరం మంత్రి లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు.
వేసవిని దృష్టిలో పెట్టుకుని మున్సిపాలిటీ ప్రజలు ఎక్కడ కూడా తాగునీటి ఎద్దడి రాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఛైర్ పర్సన్ మాధవి రమేష్ అధికారులను ఆదేశించారు. వనపర్తి జిల్లాలోని 33వ వార్డులో నూతన బోరు మోటర్ బిగించి వార్డు వాసులకు భరోసా కల్పించారు. బోరు మోటర్ నుంచి అంతర్గత పైప్లైన్లో బిగించి ప్రతి ఇంటికి తాగునీరు అందేలా చూడాలన్నారు.
MDK: నార్సింగి మండలం వల్లూర్లో మాజీ ఎంపీపీ చిందం సబిత కుటుంబాన్ని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకురాలు, మాజీ ఎంపీపీ చిందం సబిత భర్త రవీందర్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మరణించారు. ఈ విషాద ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
E.G: నిడదవోలు మండలం శెట్టిపేట ZP హైస్కూల్ దగ్గరలో సెల్ టవర్ ఏర్పాటు చేయడానికి వ్యతిరేకిస్తూ BSP నాయకులు బయ్యే మునేంద్ర ఆధ్వర్యంలో మంగళవారం నిరసన నిర్వహించారు. సెల్ టవర్ వలన సమీపంలో ఉన్న విద్యార్థులు పరిసరాలలో జీవించేవారు రేడియేషన్తో అనారోగ్యానికి గురి అయ్యే ప్రమాదం ఉందన్నారు. వెంటనే అధికారులు స్పందించి టవర్ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలన్నారు.
ఏలూరు: జిల్లావ్యాప్తంగా మంగళవారం జరిగిన ద్వితీయ సంవత్సరం ఇంటర్ తెలుగు పబ్లిక్ పరీక్షకు 98 శాతం హాజరు నమోదైనట్లు ఆర్ఐవో యోహాన్ తెలిపారు. మొత్తం 16,433 మంది విద్యార్థులకు గాను 16,046 మంది హాజరయ్యారని, 387 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. హాజరైన వారిలో జనరల్ విభాగం నుంచి 14,209 మంది, ఒకేషనల్ నుంచి 1,837 మంది ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.
JGL: పదవ తరగతి విద్యార్థులు తరగతులకు తప్పకుండా హాజరుకావాలని మండల విద్యాధికారి శ్రీపతి రాఘవులు అన్నారు. రాయికల్ మండలంలోని అల్లీపూర్ పాఠశాలలో మంగళవారం 10వ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు రాస్తున్న పరీక్ష కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులు పరీక్ష సమయంలో ఎలాంటి ఒత్తిడికి గురి కావద్దని, పరీక్షలకు హాజరయ్యేంత వరకు తరగతులకు తప్పకుండా హాజరు కావాలని సూచించారు.
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం భేటీ అయ్యింది. దాదాపు 55 అజెండా అంశాలపై చర్చించి ఆమోదం తెలపనుంది. ఇటీవల పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. అలాగే.. విశాఖ, కాకినాడ, చీరాల, రాజమండ్రి, తిరుపతి, సత్యసాయి జిల్లాల్లోని పలు పర్యాటక ప్రాజెక్టులకు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.
ASR: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శత జయంతిని పురష్కరించుకుని అరకులోయలో హిందూ సమ్మేళనం నిర్వహించారు. మంగళవారం అరకులోయ ఎన్టీఆర్ గ్రౌండ్ నుంచి వేంకటేశ్వరస్వామి ఆలయం వరకు కోలాటం, దింసాలతో శోభాయాత్ర నిర్వహించారు. ఆధ్యాత్మిక వక్త రాధమనోహర్ దాస్ ముఖ్య అతిథిగా పాల్గొని హిందుత్వం, సనాతన ధర్మం ప్రాముఖ్యతను వినిపించారు. హిందూ బందువులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
MLG: ఎర్రమంజిలోని మిషన్ భగీరథ కార్యాలయంలో, గ్రామీణ మంచినీటి సరఫరా, వేసవి సన్నద్ధతపై మంత్రి సీతక్క రివ్యూ నిర్వహించారు. ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా చేసే లక్ష్యంతో మిషన్ భగీరథ సిబ్బంది పని చేయాలని, కేంద్ర ప్రభుత్వం ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేలా నిధులు మంజూరు చేయాలని మంత్రి కోరారు.
SRD: సమగ్ర సస్యరక్షణ చేపడితే పంట అధిక దిగుబడులు సాధించవచ్చని ఖేడ్ ADA నూతన్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం సిర్గాపూర్ మండలం వాసర్ గ్రామంలోని రైతు వేదికలో రైతులకు సమావేశపరిచి పంటల సాగు పద్ధతులపై అవగాహన కల్పించారు. రబీ సీజన్ పంటలు పూర్తవగానే చేనులో వేసవి దుక్కులు దున్నడం అవసరమని సూచించారు. సకాలంలో సస్యరక్షణలు చేపడితే పంట భూమిలో కీటకాలు ఉండవన్నారు.
TG: ఇంటర్, పదో తరగతి పరీక్షల నిర్వహణపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంటర్, SSC పరీక్షలకు 5 నిమిషాలు ఆలస్యంగా హాజరుకు అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు. పరీక్షలో అవకతవకలు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
SKLM: పెద్దపాడులోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ ప్రవేశ పరీక్షను వాయిదా వేశారు. మార్చి 2న నిర్వహించాల్సిన ఈ పరీక్షలను మార్చి 8వ తేదీకు మార్చినట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాస్ దేవి మంగళవారం ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
KKD: డొక్కా సీతమ్మ ఆశయాలతో పేదల కోసం జనసేన కృషి చేస్తుందని జగ్గంపేట జనసేన పార్టీ ఇంఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ పేర్కొన్నారు. ఈ మేరకు జగ్గంపేటలో పాత పోలీస్ స్టేషన్ వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం నిర్వహించే డొక్కా సీతమ్మ ఉచిత క్యాంటీన్ ను దాతల సాయంతో నిర్వహించి 500 మంది పేదలకు అన్నదానం నిర్వహించారు.
భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ గాయపడింది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆమెకు మోకాలి నొప్పి మళ్ళీ తిరగబెట్టింది. దీంతో హర్మన్ ఫీల్డింగ్కు రాలేదు. దీనిపై బీసీసీఐ స్పందిస్తూ.. ప్రస్తుతం ఆమెను వైద్య బృందం పర్యవేక్షిస్తోందని తెలిపింది. అయితే, 36 ఏళ్ల హర్మన్ గత కొంత కాలంగా మోకాలి నొప్పితో బాధపడుతోంది.