KMR: విద్యార్థులకు, క్రీడాకారులకు ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ.. వారి ఉన్నతికి విశేష కృషి చేస్తున్న జడ్పీహెచ్ఎస్ పేట్సంగం పీఈటీ, బామన్ నాయక్ స్పోర్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు లక్ష్మణ్రాథోడ్కు ఇండియన్ బెస్ట్ ఇన్స్పిరేషన్ అవార్డు వరించింది. న్యూఢిల్లీకి చెందిన గ్యాన్ ఉదయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం అవార్డును ఆయనకు అందజేసింది.
నెల్లూరు జిల్లాలో వివిధ ఎంపీడీవో కార్యాలయంలో అటెండర్లుగా విధులు నిర్వహిస్తున్న 17 మందికి మంగళవారం జెడ్పీ ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మ పదోన్నతి కల్పించారు. ఈ మేరకు ఉత్తర్వులు అందజేశారు. ఎంపీడీవో కార్యాలయంలో ఆఫీసు సబార్డినేట్ గా పనిచేస్తున్న వారికి పదోన్నతి కల్పించి హైస్కూల్లో రికార్డు అసిస్టెంట్లుగా నియమించినట్లు తెలియజేశారు.
NZB: భీంగల్ మండలం పల్లికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్నత పాఠశాలల లాంగ్వేజెస్ ఉపాధ్యాయుల కాంప్లెక్స్ సమావేశం మంగళవారం ప్రారంభమైంది. ఐ.సీ.టీ టూల్స్, డిజిటల్ టూల్స్, IFP బోర్డు, దీక్ష ఆప్ మొదలైన వాటిని పాఠశాలలో ఏ విధంగా ఉపయోగిస్తునరన్న ఆంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల లాంగ్వేజెస్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సిరిసిల్ల పట్టణంలోని 33వ వార్డు కౌన్సిలర్ కొండ వర్షిణి-నరేష్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ను ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు ఎంపీ బండి సంజయ్ను శాలువుతో ఘనంగా సన్మానించారు. కౌన్సిలర్గా గెలుపొందడం సంతోషంగా ఉందని ఎంపీ అభినందిచారు. ప్రజలకు నిరంతరం తోడు ఉంటూ.. వార్డు అభివృద్ధికి కృషి చేయాలని కేంద్ర మంత్రి తెలిపారు.
TG: HYDలోని ఇందిరాపార్క్ వద్ద RTC జేఏసీ ధర్నా చేపట్టింది. చలో సెక్రటేరియెట్కు పిలుపునిచ్చింది. RTCని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేసింది. పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలు నెరవేర్చాలని కోరింది. వేతన సవరణ 30 శాతం ఫిట్మెంట్తో అమలు చేయాలని, గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహించాలని పేర్కొంది.
HNK: పిల్లల బంగారు భవిష్యత్తును కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో విస్తృత అవగాహన అవసరమని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. బాల్య వివాహ విముక్తి అవగాహన ప్రచార రథాన్ని నేడు హన్మకొండలో ఎంపీ ప్రారంభించారు. బాల్య వివాహాలు బాలికల విద్య, ఆరోగ్యం, మానసిక వికాసంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని అన్నారు.
VSP: ఏపీ పర్యాటక రంగంలో విశాఖపట్నం జిల్లా కీర్తి కిరీటంగా నిలుస్తుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ శాసనసభలో ప్రకటించారు. విశాఖ పరిసరాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడానికి రూ.8,650 కోట్ల పెట్టుబడులతో 50 కీలక ఒప్పందాలు కుదిరినట్లు తెలిపారు. ‘హబ్ అండ్ స్పోక్’ మోడల్లో విశాఖను గ్లోబల్ డెస్టినేషన్గా తీర్చిదిద్దురామన్నారు.
MLG: చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టుపై ములుగు జిల్లా బీఆర్ఎస్ దళిత నాయకుడు చిట్టిమల్ల సమ్మయ్య తీవ్రంగా స్పందించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా గెలుపును జీర్ణించుకోలేక నిర్బంధాలకు పాల్పడటం హేయమని అన్నారు. కుళ్ళు రాజకీయాలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. నిమ్మగడ్డ ప్రవీణ్, కర్రీ శ్రీను, బియ్యం శ్రీను, బోడ ప్రసాద్, పాల్గొన్నారు.
ప్రకాశం: మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పులి శ్రీనివాసులును మంగళవారం కనిగిరి మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ మర్యాదపూర్వకంగా కలిశారు. జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో శాలువాతో ఘనంగా సత్కరించారు. కనిగిరి మున్సిపాలిటీ అభివృద్ధి పనులపై పలు అంశాలపై చర్చించారు. మున్సిపల్ అభివృద్ధికి సహకారం అందిస్తామని జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చారు.
కోనసీమ: ముమ్మిడివరం నియోజకవర్గానికి సంబంధించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాధాన్యత అంశాలపై ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు సీఎం చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, రహదారులు, తాగునీరు, కాలువలు, విద్యా, వైద్య రంగాలకు సంబంధించిన ప్రాజెక్టుల పురోగతిని సీఎంకి వివరించారు.
MHBD: జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద మంగళవారం తెలంగాణ మలి విడత ఉద్యమకారిణి, రచయిత్రి జలజకు కళాకారులు ఘనంగా నివాళులర్పించారు. జలజ చిత్రపటానికి డీ పీ ఆర్ ఓ రాజేంద్రప్రసాద్ పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై జిల్లా మేనేజర్ కృష్ణవేణి, కళాకారులు పాల్గొన్నారు.
KDP: రాజంపేట పార్లమెంట్ టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు, 41 మంది నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమం మార్చి 2న మదనపల్లె పట్టణంలోని రామతులసమ్మ కన్వెన్షన్లో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నారు. కార్యక్రమానికి రాష్ట్ర మరియు జిల్లా స్థాయి ప్రముఖ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
MBNR: హన్వాడ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యా బోధన, సదుపాయాలు, నిర్వహణ తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు. అనంతరం SSC విద్యార్థులతో మాట్లాడి వారి చదువు, లక్ష్యాలు, భవిష్యత్ ప్రణాళికల గురించి ఆరా తీశారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు.
SDPT: కులం పేరుతో రాజకీయం చేస్తూ MP రఘునందన్ రావును విమర్శిస్తే ఊరుకునేది లేదని బీసీ కుల సంఘాల ఐక్యవేదిక సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నీల స్వామి ముదిరాజ్, రాయపోల్ బీజేపీ మండల అధ్యక్షుడు మంకిడి స్వామి హెచ్చరించారు. మంగళవారం వారు మాట్లాడుతూ.. కులం పేరుతో రాజకీయం చేస్తున్న నీలం మధు చరిత్ర ప్రజలందరికీ తెలుసని ధ్వజమెత్తారు.
KNR: ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ జేఏసీ పిలుపునిచ్చిన ‘ఛలో సచివాలయం’ కార్యక్రమానికి కరీంనగర్ రీజియన్ టీఎంయూ నాయకులు భారీగా తరలివెళ్లారు. టీజీఆర్టీసీని ప్రైవేటుపరం చేసే కుట్రలను ఆపాలని, కార్మికులందరినీ ప్రభుత్వంలో విలీనం చేయాలని వారు డిమాండ్ చేశారు.