HYD: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన సెక్రటేరియట్లో జరిగిన సమీక్షలోని నిర్ణయాలపై కంటోన్మెంట్ MLA శ్రీగణేశ్ అధికారులతో సమావేశమయ్యారు. నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అనువైన స్థలాలను గుర్తించి అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
KNR: మున్సిపల్ ఎన్నికల్లో గెలిస్తే ఆడపిల్లల వివాహానికి రూ. 10,116 ఇస్తానని హుజరాబాద్ 21వ వార్డు కౌన్సిలర్ పంజాల రాజ్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. ఎన్నికలో ఆయన గెలవడంతో ఇచ్చిన హామీ మేరకు వార్డుకి చెందిన పోగు తేజస్వినికి వివాహం నిశ్చయం కాగా ఇవాళ నగదును అందజేశారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రజలందరూ వార్డు కౌన్సిలర్ పంజాల మనోజ్ను అభినందించారు .
AP: కేంద్రం తెచ్చిన నాలుగు కొత్త కార్మిక కోడ్ల అమలుపై రాష్ట్ర కార్మికశాఖ కసరత్తు చేస్తోంది. ఈ సంస్కరణలపై స్టేక్ హోల్డర్ల నుంచి అభ్యంతరాలు, అభిప్రాయాలను ఆహ్వానించింది. చట్టాల సరళీకరణ, ఆధునీకరణ ద్వారా కార్మికుల హక్కులను రక్షిస్తూనే.. పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పించడం దీని ప్రధాన లక్ష్యం. మార్చి 15లోగా ఈ సూచనలు అందజేయాలని ప్రభుత్వం కోరింది.
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం, ఏన్కూర్ మండలం హిమామ్ నగర్ గ్రామంలోని ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వైరా నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మాలోత్ రాందాస్ నాయక్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని, సేవాలాల్ మహారాజ్ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
NRML: ఆర్టీసీ సమస్యల పరిష్కారం, ప్రభుత్వంలో విలీనం తదితర డిమాండ్ల సాధన కోసం ఈ నెల 24న ఛలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏ.ఆర్.రెడ్డి శుక్రవారం ప్రకటనలో పిలుపునిచ్చారు. వేతన సవరణ అమలు, బకాయిల చెల్లింపు, ఖాళీల భర్తీ వంటి ప్రధాన డిమాండ్లపై అన్ని డిపోల ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన కోరారు.
MNCL: క్యాతనపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్ విషయంలో కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు మానుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాకా పేరు ప్రతిష్టను అభాసుపాలు చేస్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామి, మనవడు ఎంపీ వంశీకృష్ణ దౌర్జన్యాలు అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.
TG: మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆస్తి అని అన్నారు. మంత్రులపై కావాలనే BJP నేతలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరంపై CBI విచారణ చేయించాలని అడిగినా.. కిషన్ రెడ్డి స్పందించడం లేదన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చూసైనా బండి సంజయ్ బద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు.
NRML: ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల్లో పలు ప్రారంభోత్సవాలు, భూమి పూజలను నిర్మల్ డసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ .. ఉట్నూర్లోని కన్నాపూర్, గంగాపూర్, పాత ఉట్నూర్లలో రూ.10 లక్షలతో వివో బిల్డింగ్స్కు భూమి పూజ చేశామన్నారు. అలాగే రూ. 20 లక్షలతో జీపీ భవనాలు ప్రారంభం అయ్యాయన్నారు.
ASF: నమ్మి కౌన్సిలర్ టికెట్ ఇస్తే పార్టీని మోసం చేసిన ఘనత మాజీ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు శ్యామ్దని స్థానిక నాయకులు ఆరోపించారు. శుక్రవారం ఆసిఫాబాద్లో మాట్లాడుతూ.. జిల్లాలో యూత్ కాంగ్రెస్లో ఇచ్చిన ఏకైక టికెట్ శ్యామ్ వాళ్ళ భార్యకే అన్నారు. వారిని గెలిపించేందుకు తాము తీవ్రంగా కష్టపడినట్లు తెలిపారు. మరోసారి పార్టీ పైన తప్పుడు ఆరోపణ చేస్తే సహించేది లేదన్నారు.
‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా తర్వాత ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని తన తదుపరి ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. దర్శకుడు కిషోర్ తిరుమల వద్ద ఒక కథను తీసుకున్న రామ్.. మరో కథను కూడా అభివృద్ధి చేస్తున్నాడట. రైటింగ్ టీంతో కలిసి స్వయంగా కథా చర్చల్లో పాల్గొంటున్నట్లు సమాచారం. సొంత బ్యానర్పై కొత్త దర్శకుడితో సినిమాను నిర్మించే ఆలోచనలో రామ్ ఉన్నట్లు తెలుస్తోంది.
NLG: యువత స్వయంకృషితో ఎదగాలని చిట్యాల ఎస్సై రవి కుమార్ అన్నారు. చిట్యాల మండలం, పెద్దకాపర్తిలో ఏర్పాటు చేసిన బెల్లం చాయ్ షాప్ను శుక్రవారం ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని యువకులు ఆర్థికంగా ఎదగడం కోసం వ్యాపారాలను ఎంచుకోవాలని సూచించారు. నిర్వాహకులను ఎస్సై అభినందించారు.
WGL: వర్ధన్నపేట నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలిపారు. ఆకేరు వాగుపై చెక్ డాం పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. రైతుల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తూ ముందుకు వెళుతుందని, నియోజకవర్గంలోని పంటల సాగుకు నీటిని అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ కోదండ స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయంలో స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణంలో స్వామివారికి తిరుకల్యాణోత్సవం, అగ్ని ప్రతిష్ట, తదితర పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో కసాపురం ఆలయ ఈవో విజయరాజు, ఆలయ ధర్మకర్త సుగుణమ్మ, తదితరులు పాల్గొన్నారు.
సత్యసాయి: నల్లమడ మండలంలోని గోపేపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. గ్రామానికి చెందిన తోలేటి ప్రభావతమ్మకు చెందిన మామిడి తోట ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 400 మామిడి చెట్లు పూర్తిగా కాలిపోయి బూడిదయ్యాయి. ఈ ఏడాది పూత బాగా రావడంతో మంచి దిగుబడి వస్తుందని ఆశించిన రైతుకు, ఈ ఘటన తీరని వేదన మిగిల్చింది.
E.G: ఈనెల 22న రాజానగరంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ శుక్రవారం తెలిపారు. మార్చి 14న ఆవిర్భావ దినోత్సవ ఉత్సవం & క్రియాశీలక సభ్యత్వ నమోదు, పలు కమిటీల నిర్మాణం, తదితర వాటిపై నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. కావున పార్టీ శ్రేణులు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.