AP: సిద్దిపేట కోమటిచెరువు ప్రాంతంలో తిరుపతి వెంకటేశుడు కొలువుదీరనున్నాడు. తిరుపతి వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావు, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడిని కలిశారు. ఈ సందర్భంగా సిద్దిపేటలో టీటీడీ వెంకన్న ఆలయం ఏర్పాటు చేయాలని కోరారు. వచ్చే టీటీడీ పాలకమండలి సమావేశంలో దీనిని ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు.