ఆసియాలోనే అతిపెద్ద టెలికాం, మీడియా, టెక్నాలజీ ఈవెంట్ ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025’ 9వ ఎడిషన్ ప్రారంభమైంది. ఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్లో ప్రధాని మోదీ ఈ ఈవెంట్ను ప్రారంభించారు. టెలీకమ్యూనికేషన్ల విభాగం(DoT),సెల్యూలర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(COAI) సంయుక్త ఆధ్వర్యంలో ‘మార్పు దిశగా ఆవిష్కరణలు’ అనే థీమ్తో నిర్వహిస్తున్నారు.