AP: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్త్రీ సాధికారత కోసం కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఈనెల 8న జరిగే బహిరంగ సభ వేదికగా సీఎం చంద్రబాబు వీటిని వెల్లడించనున్నారు. మహిళల సంరక్షణ కోసం కొత్తగా మరో 10 వన్స్టాప్ సెంటర్లను 8న ప్రారంభించనున్నారు. తణుకు, రంపచోడవరం, తుళ్లూరు, మార్కాపురం, ఆదోని, టెక్కలి, మాచర్ల, మదనపల్లె, కుప్పం, తిరువూరులో ఏర్పాటు చేయనున్నారు.