TCS సహా ఇతర టెక్ సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలో ఇన్ఫోసిస్ నియామకాల్లో కొత్త పద్ధతిని అమలు చేస్తోంది. ప్రతిభావంతుల కోసం వెతికే బాధ్యతను ఉద్యోగులకే అప్పగించింది. ఉద్యోగులు సిఫార్సు చేసే అభ్యర్థులను ఎంపిక చేసి, వారికి జాబ్ ఇవ్వాలని నిర్ణయించింది. సిఫార్సు చేసిన ఉద్యోగులకు ప్రోత్సాహకాలను (Incentives) కూడా అందించనున్నట్లు సమాచారం.