ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో భారీ ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో 12 మంది మావోలు, ముగ్గురు జవాన్లు మృతి చెందారు. ఘటనాస్థలంలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో మావోయిస్టుల కోసం ఇంకా కూబింగ్ కొనసాగుతుంది.