తమిళనాడులోని కరూర్లో టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రచారసభ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 39 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి టీవీకే ప్రధాన కార్యదర్శి బుస్సి ఆనంద్ సహా నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. TN-PPDL చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు ఫైల్ అయింది.