తమిళనాడు తొక్కిసలాట ఘటనపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. కరూర్ ర్యాలీలో జరిగిన విషాదకరమైన తొక్కిసలాట తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు తన హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నానని, ఈ క్లిష్ట సమయంలో వారికి బలం చేకూరాలని కోరుకుంటున్నానని తెలిపారు. గాయపడినవారు త్వరలో కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.