దుర్గా నవరాత్రుల సందర్భంగా ప్రజలు శక్తి ఉపాసన చేస్తారని ప్రధాని మోదీ అన్నారు. దేశవ్యాప్తంగా నారీ శక్తికి నిదర్శనంగా ఉత్సవాలు నిర్వహిస్తారని.. అన్ని రంగాల్లో మహిళలు ప్రతిభ చాటుతున్నారని కొనియాడారు. సముద్రంలో ఇద్దరు మహిళలు 8 నెలలపాటు 50 వేల కి.మీ యాత్ర చేశారని వెల్లడించారు. లెఫ్టినెంట్ కమాండర్లు దిల్నా, రూప ధైర్యసాహసాలు ప్రదర్శించారని ప్రశసించారు.