KRNL: ఆదోని మండలం పాండవగల్లు గ్రామంలో భగత్ సింగ్ జయంతిని పురస్కరించుకుని డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆదివారం శ్రమదానం నిర్వహించారు. మండల అధ్యక్షుడు వీరేష్, కార్యదర్శి వీరాంజనేయులు మాట్లాడుతూ.. భగత్ సింగ్ యువతకు ఆదర్శమని, ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. గ్రామాభివృద్ధిలో యువత పాత్ర కీలకమని పేర్కొన్నారు.