సత్యసాయి: సోమందేపల్లి మండల కేంద్రంలో శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో దేవి నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారు 7వ రోజు మధుర మీనాక్షిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ధర్మకర్త డీసీ ఈశ్వరయ్య ఆధ్వర్యంలో అమ్మవారిని మధుర మీనాక్షిగా అలంకరించి పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.