KKD: కరూర్లో నటుడు, TVK పార్టీ అధ్యక్షులు విజయ్ చేపట్టిన ర్యాలీలో తొక్కిసలాట దురదృష్టకరం అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో 39 మంది మరణించారని తెలిసి దిగ్భ్రాంతికి లోనైనట్లు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని.. క్షతగాత్రులకు తమిళనాడు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని కోరారు.