HYD: మూసీ నదిలో వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. తాజాగా అధికారులు ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ నుంచి మొత్తం 10,000 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. నిన్న రాత్రి అత్యధికంగా 36,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన అధికారులు, ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ ఫ్లో తగ్గడంతో అవుట్ ఫ్లోను నియంత్రణలోకి తీసుకొచ్చారు. దీంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.