TG: బతుకమ్మ సంబరాల్లో భాగంగా బైక్, సైకిల్, స్కేటర్స్ ర్యాలీ నిర్వహించారు. ఎల్బీ స్టేడియం-NTR స్టేడియం వరకు కొనసాగనున్న ఈ ర్యాలీని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. HYD విమెన్ బైకర్స్ సంప్రదాయ వస్త్రధారణతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించి టూరిజం ప్రమోషన్లో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు.