AP: పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డికి మాచర్ల న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. వారిని అధికారులు నెల్లూరు జైలుకు తరలించారు. జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులపై కేసు నమోదైంది. అయితే, ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో కూడా రద్దయ్యింది. రెండు వారాల్లో లొంగిపోవాలని సుప్రీం సూచించింది. దీంతో పిన్నెల్లి సోదరులు మాచర్ల కోర్టులో లొంగిపోయారు.