TG: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో హైడ్రామా కొనసాగుతోంది. BRSతోనే పొత్తు ఉంటుందని సీపీఐ కౌన్సిలర్లు వెల్లడించారు. దీంతో ఛైర్మన్ పీఠం తమదేనని BRS ధీమా వ్యక్తం చేస్తోంది. మాజీ MLA బాల్క సుమన్ అరెస్ట్తో CPI స్థానిక నేతలు డైలామాలో పడ్డారు. మరోవైపు CPI అధిష్టానం కాంగ్రెస్తో కలవడం మంచిదని సూచించగా.. BRSకు మాట ఇచ్చి వెనక్కి తగ్గితే ఎలా కౌన్సిలర్లు యోచనలో పడ్డారు.