AP: పూర్తికాని వెలుగొండను.. జాతికి అంకితమంటూ జగన్ ప్రజలను మోసగించారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. గుండ్లకమ్మ గేట్లు విరగ్గొట్టి గత పాలకులు ఇసుక దోపిడీకి పాల్పడ్డారని, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు ఏం చేసినా చంద్రబాబే చేశారని గుర్తుచేశారు. గుండ్లకమ్మ గేట్ల మరమ్మతులతో పాటు కూటమి ప్రభుత్వం గేట్లు బిగించిందన్నారు. రైతులకు సకాలంలో నీరు అందించి పంటలను కాపాడామని తెలిపారు.