TG: CM రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. ‘రైతు భరోసా ఇవ్వకుండా రైతులను మోసం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలు కాగానే రైతుభరోసా ఇస్తామన్నారు. ఎన్నికల ముందు హామీలిస్తున్నారు.. తర్వాత మర్చిపోతున్నారు. 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు వేశామని 9 నెలలుగా చెప్పారు. 67 లక్షల మంది రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు’ అని పేర్కొన్నారు.