రెండేళ్ల తర్వాత గాజాలో బందీల విడుదల మొదలైంది. ఏడుగురు బందీలను హమాస్ రెడ్ క్రాస్కు అప్పగించింది. మిగిలిన వారిని మరికొంత సమయం తర్వాత విడుదల చేశారు. ఇప్పటికే రెడ్క్రాస్ వాహనశ్రేణి గాజాలోని ఖాన్ యూనిస్కు చేరుకుంది. బందీలకు స్వాగతం పలుకుతూ ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు, ఆయన సతీమణి సందేశం పంపారు. మరోవైపు బందీల కుటుంబ సభ్యులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.