KMR: లింగంపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అమ్మ ఒడి కార్యక్రమం నిర్వహించడం జరిగిందని మండల వైద్యాధికారి హిమబిందు తెలిపారు. సోమవారం పీహెచ్సీ పరిధిలోని గ్రామాల్లోని గర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి రక్త పరీక్షలు చేయడం జరిగిందని చెప్పారు. ప్రభుత్వ హాస్పిటల్లో సుఖ ప్రసవాలు చేసుకునేలా సిబ్బంది అవగాహన కల్పించాలన్నారు.