ముఖంపై మొటిమలు, మచ్చలను తగ్గించడంలో కలబంద కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కలబంద గుజ్జు, పసుపు, రోజ్ వాటర్ గ్రైండర్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. అందులో కొంచెం శనగపిండి వేసి మరోసారి మిక్సీ పట్టుకుని.. ఆ మిశ్రమాన్ని ముఖంపై రాసి 20 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీళ్లతో క్లీన్ చేసుకోవాలి. ఇలా తరుచూ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.