AP: మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష ముగిసింది. మొంథా తుఫాన్పై ఆందోళన అవసరం లేదని పేర్కొన్నారు. అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. రేపు ఉదయంలోపు తుఫాన్ తీరం దాటుందని RTGS సెంటర్ నుంచి నేరుగా అలర్ట్ చేయాలన్నారు. ప్రతి విభాగం సన్నద్ధంగా ఉండాలని సూచించారు.