పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సి ఈవెంట్ రచ్చ రచ్చ అయ్యింది. నిర్వహణ సరిగా లేక మెస్సి త్వరగా వెళ్లిపోవడంతో ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. దీనిపై సీఎం మమతా సీరియస్ అయ్యి విచారణకు ఆదేశించారు. దీంతో యాక్షన్ తీసుకున్న పోలీసులు.. ఈవెంట్ ఆర్గనైజర్ను అరెస్ట్ చేశారు. మెస్సి కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఫ్యాన్స్కు మాత్రం నిరాశే మిగిలింది.