ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో యూపీఐ పేమెంట్స్(UPI Payments) వసూలు అయ్యాయి. గత నెలలో 890 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఆ లావాదేవీల విలువ రూ.14.07 లక్షల కోట్లు కావడం గమనార్హం. మార్చి నెలతో పోలిస్తే విలువలోనూ, లావాదేవీల పరిమాణంలోనూ స్వల్పంగా వృద్ధిరేటు నమోదైనట్లు తెలుస్తోంది.
జమ్మూకశ్మీర్లోని తమ సహచర ఉగ్రవాదుల(Terrorists)కు సందేశాలు పంపేందుకు 14 మెసెంజర్ యాప్ల(Mobile Messenger Apps)ను ఉపయోగిస్తున్నట్లు కేంద్ర కనుగొంది. ఆ యాప్స్ ను బ్యాన్ చేసింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి జెండా ఎగరేయాలని అన్ని పార్టీలు కసి మీద ఉన్నాయి. ఆ మేరకు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ సందర్బంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఓటర్లపై వరాల జల్లులు కురిపిస్తున్నాయి. ఈ సందర్భంగా ఓటర్లకు అమలు చేయాల్సిన పనుల మేనిఫెస్టోపై ఫోకస్ చేస్తున్నాయి
అవినీతి ప్రభుత్వంగా ముద్రపడిన బీజేపీ పాలనపై ప్రజల్లో ఆగ్రహం తీవ్రంగా ఉంది. ఎన్నికల సరళిని చూస్తుంటే బీజేపీ ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. అయితే గెలిచేందుకు ప్రజలను ఆకట్టుకునే పనిలో ఈ ఉచిత తాయిలాల ప్రకటన కాషాయ పార్టీ విడుదల చేసింది.
స్వేచ్ఛ పేరిట జీవితాంతం కలిసి ఉండాల్సిన వారు విడిపోతున్నారు. కొన్నాళ్లు కలిసి ఉంటారు.. కాపురం, సంసారంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడినా విడాకులు తీసేసుకుంటున్నారు. ఈ నయా పోకడకు భారత అత్యున్నత న్యాయస్థానం కూడా వంతపాడింది.
మామిడి కాయల కోసం తోటకు వెళ్లిన చిన్నారులపై పిడుగు రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. వర్షానికి చెట్టు కింద నిలబడిన నలుగురు చిన్నారులపై పిడుగు పడడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.
జిగర్ పటేల్ నిద్రపోతున్న వీడియోలు మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఈ వీడియోలు వైరల్ (Viral)గా మారడంతో ప్రభుత్వం దృష్టికి చేరింది. వెంటనే ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చూపారనే కారణంతో ఆయనను సస్పెండ్ చేశారు.
ట్విట్టర్ యూజర్ల(Twitter Users)కు ఎలాన్ మస్క్(Elon Musk) ఓ షాకింగ్ న్యూస్ చెప్పాడు. ఇకపై ట్విట్టర్ లో వార్తలను ఫ్రీగా చదవలేరు. అలా వార్తలు చదివేందుకు కూడా ఎలాన్ మస్క్ డబ్బులు వసూలు చేస్తున్నాడు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(narendra modi) హోస్ట్ చేస్తున్న మన్ కీ బాత్(Mann Ki Baat) 100వ ఎపిసోడ్ కార్యక్రమం ఏప్రిల్ 30న జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో సైతం ప్రసారం చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని కీలక అంశాలను పంచుకున్నారు.
పంజాబ్(punjab)లోని లూథియానా(ludhiana)లో ఓ పాల ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీక్(milk factory Gas leak) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో చాలా మంది స్పృహ తప్పి పడిపోయారు. 11 మంది మరణించినట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. మృతుల్లో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారని తెలిపారు. మరోవైపు ఆస్పత్రిలో చేరిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అన్నారు. మరోవైపు...
రెండస్తుల భవనం ఆకస్మాత్తుగా కుప్పకూలింది(Building collapse). ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో 11 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం మహారాష్ట్ర థానేలోని భివాండి(bhiwandi thane maharashtra)లో చోటుచేసుకుంది.