ఓ విమానాన్ని పక్షి ఢీ కొంది. ఆ పక్షి పైలట్ ముందు వేలాడుతూ వీడియోలో కనిపించింది. క్లిష్ట పరిస్థితుల్లో ప్లైట్ను పైలట్ చాకచక్యంగా ల్యాండ్ చేశాడు. నెటిజన్లు అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఆదిపురుష్ మూవీపై ఢిల్లీ హైకోర్టులో కేసు నమోదైంది. హిందువుల విశ్వాసాలు దెబ్బతీసేలా సన్నివేశాలు ఉన్నాయని హిందూ సేన అంటోంది. వాటిని సినిమా నుంచి తొలగించాలని ధర్మాసనాన్ని కోరింది.
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన 119 స్థానాల్లో పోటీ చేస్తుందని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సింకారు శివాజీ శుక్రవారం తెలిపారు. కొన్ని స్థానాల్లో జర్నలిస్టులను కూడా పార్టీ బరిలోకి దించుతుందని ఆయన వెల్లడించారు.
భారత్లో ఐసీసీ వరల్డ్ కప్ జరగనుంది. ఈ ప్రపంచ కప్ కోసం మొత్తం 10 జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీకి ముందుగా క్వాలిఫయర్ మ్యాచ్ లను నిర్వహించనున్నారు. ఇందులో మొత్తం 10 జట్లు పాల్గొననున్నాయి. ఫైనల్ కు చేరిన 2 జట్లు మాత్రం ప్రపంచ కప్ కు అర్హత సాధించనున్నాయి.
బీపర్జోయ్ తుఫాను కారణంగా వందలాది గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని అక్కడి అధికారులు పేర్కొన్నారు. అనేక చోట్ల చెట్లతోపాటు విద్యుత్ స్తంభాలు నెలకూలినట్లు వెల్లడించారు.
జమ్మూకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో శుక్రవారం ఉగ్రవాదులు, భద్రతా సిబ్బంది మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ప్రస్తుతం ఈ ఎన్కౌంటర్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారని, ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఎల్ఓసీలోని జుమాగుండ్ ప్రాంతంలో ఉగ్రవాదులపై ఆమ్రీ, పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంకా ఆ ప్రాంతంలో సోదాలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.